ETV Bharat / state

Hyderabad Outer Ring Road: 'బంగారు బాతు ఓఆర్​ఆర్​ను కేటీఆర్ 30 ఏళ్లకు అమ్మేశారు'

author img

By

Published : May 1, 2023, 5:53 PM IST

Updated : May 1, 2023, 6:52 PM IST

Revanth Reddy Comments on Outer Ring Road: హైదరాబాద్‌ మణిహారమైన ఓఆర్ఆర్‌ను ముంబయికి చెందిన ఓ కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోన్న ఓఆర్‌ఆర్‌ను రూ.246 కోట్లకే అమ్మేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసేందుకు నూతన సచిలవాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Comments on Outer Ring Road: హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను నిర్మించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.6,696 కోట్లతో అప్పటి ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం తీసుకొచ్చి.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందని రేవంత్‌రెడ్డి అన్నారు.

దీని ద్వారా ప్రతీ ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన ఓ కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రూ.750 కోట్లు వస్తుంటే.. రూ.246 కోట్లకే ప్రభుత్వం అమ్మేసిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. బంగారు బాతును కేటీఆర్‌ 30 ఏళ్లకు అమ్మేశారని రేవంత్‌ మండిపడ్డారు.

రేవంత్​రెడ్డి అడ్డగింత..: అంతకుముందు ఓఆర్‌ఆర్ టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసేందుకు సచివాలయానికి బయలుదేరిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులను కలిసేందుకు రేవంత్‌ అనుమతి తీసుకోలేదన్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సచివాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డిని టెలిఫోన్‌ భవన్ వద్ద అడ్డుకున్నారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై అధికారులను కలుస్తానన్న రేవంత్‌రెడ్డి.. టెండర్‌ను 30 ఏళ్లకు ఒక సంస్థకు ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. సచివాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారన్న రేవంత్‌రెడ్డి.. వినతి పత్రం ఇచ్చేందుకు ఎప్పుడు రావాలో అధికారులు ఎలా చెబుతారన్నారు. టెలిఫోన్ భవన్‌ నుంచి మింట్ కాంపౌండ్‌ వరకు వచ్చేందుకు రేవంత్‌రెడ్డికి పోలీసులు అనుమతిచ్చారు. అక్కడకి పోలీసులు తమ వాహన వలయంలో దగ్గరుండి ఆయన్ను తీసుకెళ్లారు.

ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన రేవంత్‌: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో సెక్షన్‌ అధికారికి రేవంత్‌రెడ్డి ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి ఆర్‌టీఐ చట్టం కింద సమాచారాన్ని అందించాలని అధికారులను కోరారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలను తెలియచేయాలని రేవంత్‌ దరఖాస్తు చేశారు.

Revanth Reddy Comments on Outer Ring Road: హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను నిర్మించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.6,696 కోట్లతో అప్పటి ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం తీసుకొచ్చి.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందని రేవంత్‌రెడ్డి అన్నారు.

దీని ద్వారా ప్రతీ ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన ఓ కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రూ.750 కోట్లు వస్తుంటే.. రూ.246 కోట్లకే ప్రభుత్వం అమ్మేసిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. బంగారు బాతును కేటీఆర్‌ 30 ఏళ్లకు అమ్మేశారని రేవంత్‌ మండిపడ్డారు.

రేవంత్​రెడ్డి అడ్డగింత..: అంతకుముందు ఓఆర్‌ఆర్ టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసేందుకు సచివాలయానికి బయలుదేరిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులను కలిసేందుకు రేవంత్‌ అనుమతి తీసుకోలేదన్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సచివాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డిని టెలిఫోన్‌ భవన్ వద్ద అడ్డుకున్నారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై అధికారులను కలుస్తానన్న రేవంత్‌రెడ్డి.. టెండర్‌ను 30 ఏళ్లకు ఒక సంస్థకు ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. సచివాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారన్న రేవంత్‌రెడ్డి.. వినతి పత్రం ఇచ్చేందుకు ఎప్పుడు రావాలో అధికారులు ఎలా చెబుతారన్నారు. టెలిఫోన్ భవన్‌ నుంచి మింట్ కాంపౌండ్‌ వరకు వచ్చేందుకు రేవంత్‌రెడ్డికి పోలీసులు అనుమతిచ్చారు. అక్కడకి పోలీసులు తమ వాహన వలయంలో దగ్గరుండి ఆయన్ను తీసుకెళ్లారు.

ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన రేవంత్‌: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో సెక్షన్‌ అధికారికి రేవంత్‌రెడ్డి ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి ఆర్‌టీఐ చట్టం కింద సమాచారాన్ని అందించాలని అధికారులను కోరారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలను తెలియచేయాలని రేవంత్‌ దరఖాస్తు చేశారు.

ఇవీ చదవండి:

REVANTH REDDY: 'రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా'

REVANATH on ORR: 'రూ. 1000 కోట్లకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు అమ్మకం.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం'

వసూళ్లులో ఘనం.. సౌకర్యాల్లో విఫలం.. ఇది ఔటర్​రింగ్​ రోడ్డు పరిస్థితి

Last Updated : May 1, 2023, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.