మారువేషంలో ఏపీలోని ఉత్తరాంధ్ర మీదుగా పారిపోతున్న పాక్ ఉగ్రవాదిని ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్న సమాచారం సంచలనం రేపుతోంది. ముంబయి నుంచి కోల్కతా వెళ్తోన్న ఓ లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న అధికారి... అనుమానితుడిని ఉగ్రవాదిగా పసిగట్టారు. సమాచారాన్ని ఎన్ఐఏకు చేరవేశారు.
ఉగ్రవాది ప్రయాణించిన లారీ సమాచారాన్ని విశాఖ పోలీసులకు అందజేశారు. అప్పటికే లారీ విశాఖ జిల్లా దాటిపోవటంతో.. శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. నిన్న అర్ధరాత్రి సోదాలు చేస్తుండగా ఉగ్రవాది ప్రయాణిస్తున్న లారీని పోలీసులు గుర్తించారు.
ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడిని విశాఖకు తీసుకువచ్చినట్టుగా సమాచారం. అనుమానితుడిని రహస్య ప్రదేశంలో ఎన్ఐఏ విచారిస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై పోలీసు అధికారులు, ఎన్ఐఏ వర్గాలు ఇంతవరకు ఎటువంటి ధ్రువీకరించలేదు.
ఇదీ చదవండి : ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం