ETV Bharat / state

సేంద్రియం-ఆరోగ్యమంత్రం

తాగే నీళ్ల నుంచి ఆహారం దాకా అన్నీ కల్తీమయమే. దీనికి తోడు కూరగాయలు, పండ్ల సాగులో రసాయనాల వాడకం జనాలను భయపెడుతోంది. వీటన్నింటికి సమాధానంగా సేంద్రియ ఉత్పత్తులన్నీ ఒకే వేదికపై దొరికితే అంతకంటే ఇంకేం కావాలి.

author img

By

Published : Mar 4, 2019, 10:15 AM IST

Updated : Mar 4, 2019, 12:33 PM IST

సహజమే మాహాభాగ్యం
సహజమే మాహాభాగ్యం
హైదరాబాద్​ శిల్పారామంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, ఉత్పత్తులు కొలువుదీరాయి. రాత్రి బజార్​లో తెలంగాణ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తున్న ప్రకృతి-సేంద్రియ ఉత్పత్తుల మేళా ఆకట్టుకుంది.
undefined

ఇంట్లోనే సేద్యం..
మిద్దెపై పంటలు పండించే పద్ధతులపై అవగాహన కల్పిస్తూ హోంక్రాప్​ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్​ అందరి దృష్టిని ఆకర్షించింది. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే కూరగాయలను పండించే మెళకువలను ప్రతినిధులు వివరించారు.

ప్రకృతి తీర్థం...
మేళాలో​
నీరా స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. దీనిని ప్రకృతి సిద్ధమైన పానీయంగా సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు. ఎన్నో వ్యాధులు నయమవుతాయని కూడా వివరించారు.

సహాజ సాధనాలు...
రైతులు తయారు చేసిన పరికరాలు ఆకట్టుకున్నాయి. జంతువులు, పక్షులు నుంచి పంటలు సంరక్షించుకునేందుకు వీలుగా ఈ సాధనాలను వెలుగులోకి తెచ్చామని కర్షకులు తెలిపారు.

స్పందనకు సంతృప్తి..
ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తులు చూసి సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. మూడురోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ మేళాకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు సంతృప్తి కనబరిచారు.

ఇవీ చూడండి:అభినందన్‌కు అవార్డు

సహజమే మాహాభాగ్యం
హైదరాబాద్​ శిల్పారామంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, ఉత్పత్తులు కొలువుదీరాయి. రాత్రి బజార్​లో తెలంగాణ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తున్న ప్రకృతి-సేంద్రియ ఉత్పత్తుల మేళా ఆకట్టుకుంది.
undefined

ఇంట్లోనే సేద్యం..
మిద్దెపై పంటలు పండించే పద్ధతులపై అవగాహన కల్పిస్తూ హోంక్రాప్​ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్​ అందరి దృష్టిని ఆకర్షించింది. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే కూరగాయలను పండించే మెళకువలను ప్రతినిధులు వివరించారు.

ప్రకృతి తీర్థం...
మేళాలో​
నీరా స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. దీనిని ప్రకృతి సిద్ధమైన పానీయంగా సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు. ఎన్నో వ్యాధులు నయమవుతాయని కూడా వివరించారు.

సహాజ సాధనాలు...
రైతులు తయారు చేసిన పరికరాలు ఆకట్టుకున్నాయి. జంతువులు, పక్షులు నుంచి పంటలు సంరక్షించుకునేందుకు వీలుగా ఈ సాధనాలను వెలుగులోకి తెచ్చామని కర్షకులు తెలిపారు.

స్పందనకు సంతృప్తి..
ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తులు చూసి సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. మూడురోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ మేళాకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు సంతృప్తి కనబరిచారు.

ఇవీ చూడండి:అభినందన్‌కు అవార్డు

sample description
Last Updated : Mar 4, 2019, 12:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.