సచివాలయ కార్యాలయాల తరలింపు కోసం బూర్గుల రామకృష్ణారావు భవన్ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్కే భవన్లో ఉన్న కార్యాలయాలన్నింటినీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ కార్యాలయల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఏడో అంతస్తులో ఉన్న సాంకేతిక విద్యాశాఖ కార్యాలయాన్ని మాసబ్ ట్యాంక్కు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. మిగతా కార్యాలయాల తరలింపుపై అధికారులు దృష్టి సారించారు.
తొమ్మిదో అంతస్తులో సీఎం కార్యాలయం
బీఆర్కే భవన్లోని తొమ్మిదో అంతస్తులోకి ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాలాను తరలించే అవకాశం ఉంది. ఏడో అంతస్తులోకి సాధారణ పరిపాలన శాఖను తరలించనున్నారు. కొన్ని మినహా అన్ని శాఖలను బీఆర్కే భవన్కే తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తరలింపు నేపథ్యంలో పోలీస్ అధికారులు బీఆర్కే భవన్ను పరిశీలించారు.
ఉన్నతాధికారుల పరిశీలన
శాంతి భద్రతలు, ఎస్పీఎఫ్, ఐఎస్డబ్ల్యూ విభాగాల అధికారులు సంబంధిత అంశాలపై చర్చించారు. రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ కూడా బీఆర్కే భవన్ను పరిశీలించారు. అక్కడ ఉన్న వసతులు, ఇతర సదుపాయాలను తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా