ETV Bharat / state

PV SINDHU: నేడు హైదరాబాద్​కు పీవీ సింధు.. ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధం - టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు

తెలుగు తేజం, స్టార్ షట్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు నేడు హైదరాబాద్​కు రానున్నారు. ఉదయం 11:30 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, అభిమానులు ఘన స్వాగతం పలకనున్నారు.

PV Sindhu comes to Hyderabad today
నేడు హైదరాబాద్​కు పీవీ సింధు
author img

By

Published : Aug 4, 2021, 5:08 AM IST

Updated : Aug 4, 2021, 6:23 AM IST

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్​లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు నేడు హైదరాబాద్​కు రానున్నారు. ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు.

ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించి భాగ్యనగరం విచ్చేస్తున్న సింధుకు రాష్ట్ర క్రీడాపాధికారక సంస్థ, క్రీడా అభిమానులు ఘన స్వాగతం పలకనున్నారు. మంగళవారం మధ్యాహ్నం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు, ఆమె కోచ్​ పార్క్​ తే సంగ్​కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వీరిద్దరిని సత్కరించారు. సింధును ప్రశంసించారు.

ఇదీ చూడండి:

PV Sindhu: స్వదేశానికి పీవీ సింధు- దిల్లీలో ఘనంగా సన్మానం

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్​లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు నేడు హైదరాబాద్​కు రానున్నారు. ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు.

ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించి భాగ్యనగరం విచ్చేస్తున్న సింధుకు రాష్ట్ర క్రీడాపాధికారక సంస్థ, క్రీడా అభిమానులు ఘన స్వాగతం పలకనున్నారు. మంగళవారం మధ్యాహ్నం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు, ఆమె కోచ్​ పార్క్​ తే సంగ్​కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వీరిద్దరిని సత్కరించారు. సింధును ప్రశంసించారు.

ఇదీ చూడండి:

PV Sindhu: స్వదేశానికి పీవీ సింధు- దిల్లీలో ఘనంగా సన్మానం

Last Updated : Aug 4, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.