ETV Bharat / state

నేటి నుంచే నామపత్రాల స్వీకరణ

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకోనుంది. 17 లోక్​సభ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది.

author img

By

Published : Mar 18, 2019, 5:01 AM IST

Updated : Mar 18, 2019, 7:17 AM IST

నేటి నుంచే నామినేషన్ల పర్వం
నేటి నుంచే నామినేషన్ల పర్వం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్​ జరగనుంది. ఇందుకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. పార్లమెంట్​ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే ప్రారంభం కానుంది. నేడు ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి నామపత్రాల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 21న హోలీ, 24న ఆదివారం అయినందున ఈ రెండు రోజుల్లో నామపత్రాలు స్వీకరించబోరు. 26న నామపత్రాల పరిశీలన, 28 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్​ జరగనుంది.

పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్​తో పాటు ఈసీ నిర్ధారిత నమునాలో అఫిడవిట్​ను పొందుపర్చాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి వివరాలను పూర్తిగా పేర్కొనాలి. విద్యార్హతలు, సామాజిక మాధ్యమాల ఖాతాలతో పాటు నేర చరిత్ర, కేసుల వివరాలను పొందుపర్చాలి. అభ్యర్థులు వారి కుటుంబసభ్యుల ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేయాలి.

విదేశాల్లో ఉన్న ఆస్తులు కూడా...
అఫిడవిట్​కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కొత్త అంశాన్ని కూడా చేర్చింది. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా ప్రమాణపత్రంలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. అఫిడవిట్​లో పేర్కొన్న నేరచరిత్ర, కేసుల వివరాలను అభ్యర్థులు మూడు మార్లు పత్రికలు, టీవీల్లో ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్​ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసింది ఈసీ.

ఇవీ చూడండి: అవసరమైతే జాతీయపార్టీ పెడతా...: కేసీఆర్​

నేటి నుంచే నామినేషన్ల పర్వం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్​ జరగనుంది. ఇందుకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. పార్లమెంట్​ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే ప్రారంభం కానుంది. నేడు ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి నామపత్రాల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 21న హోలీ, 24న ఆదివారం అయినందున ఈ రెండు రోజుల్లో నామపత్రాలు స్వీకరించబోరు. 26న నామపత్రాల పరిశీలన, 28 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్​ జరగనుంది.

పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్​తో పాటు ఈసీ నిర్ధారిత నమునాలో అఫిడవిట్​ను పొందుపర్చాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి వివరాలను పూర్తిగా పేర్కొనాలి. విద్యార్హతలు, సామాజిక మాధ్యమాల ఖాతాలతో పాటు నేర చరిత్ర, కేసుల వివరాలను పొందుపర్చాలి. అభ్యర్థులు వారి కుటుంబసభ్యుల ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేయాలి.

విదేశాల్లో ఉన్న ఆస్తులు కూడా...
అఫిడవిట్​కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కొత్త అంశాన్ని కూడా చేర్చింది. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా ప్రమాణపత్రంలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. అఫిడవిట్​లో పేర్కొన్న నేరచరిత్ర, కేసుల వివరాలను అభ్యర్థులు మూడు మార్లు పత్రికలు, టీవీల్లో ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్​ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసింది ఈసీ.

ఇవీ చూడండి: అవసరమైతే జాతీయపార్టీ పెడతా...: కేసీఆర్​

Intro:tg_kmm_07_17_natika_av_c4
( )

ఖమ్మం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో నాటకం ప్రదర్శించారు. తాడేపల్లిగూడెం నాటక పరిషత్ ఆధ్వర్యంలో మధుపర్కాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. పేద నేత కుటుంబం యొక్క పరిస్థితిని వివరిస్తూ నాటకం సాగింది. నగర ప్రజలు భారీగా హాజరై నాటకాన్ని తిలకించారు.... visu


Body:నాటక ప్రదర్శన


Conclusion:నాటక ప్రదర్శన
Last Updated : Mar 18, 2019, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.