ETV Bharat / state

DARBHANGA BLAST: నిందితుల ఇళ్లలో పేలుడు పదార్థాలు, పరికరాలు స్వాధీనం - Darbhanga blast case

దర్భంగా పేలుడు కేసులో ఎన్​ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని పట్నాకు తరలించారు.

నిందితుల ఇళ్లలో పేలుడు పదార్థాలు, పరికరాలు స్వాధీనం
నిందితుల ఇళ్లలో పేలుడు పదార్థాలు, పరికరాలు స్వాధీనం
author img

By

Published : Jul 1, 2021, 10:26 PM IST

దర్భంగా పేలుడు కేసు (DARBHANGA BLAST)లో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే సోదరులైన ఇద్దరు నిందితులు మహమ్మద్​ నసీర్​ ఖాన్​, ఇమ్రాన్‌ ఖాన్​లను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నాకు తరలించారు. ఇద్దరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి.. తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని ఎన్​ఐఏ అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఎన్‌ఐఏ బృందం పలు కీలక పత్రాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్​లో వీరికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్‌లో పార్సిల్ పంపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని, నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.

నకిలీ చిరునామాతో...

55 కిలోల బరువున్న చీరల పార్సిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు ఉంచారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్సిల్​ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్సిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. ఫోన్​ నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్బాంగాలో పార్సిల్​ను రైల్లోంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు...

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్​కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ.. ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: NIA: దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్​

దర్భంగా పేలుడు కేసు (DARBHANGA BLAST)లో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే సోదరులైన ఇద్దరు నిందితులు మహమ్మద్​ నసీర్​ ఖాన్​, ఇమ్రాన్‌ ఖాన్​లను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నాకు తరలించారు. ఇద్దరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి.. తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని ఎన్​ఐఏ అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఎన్‌ఐఏ బృందం పలు కీలక పత్రాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్​లో వీరికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్‌లో పార్సిల్ పంపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని, నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.

నకిలీ చిరునామాతో...

55 కిలోల బరువున్న చీరల పార్సిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు ఉంచారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్సిల్​ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్సిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. ఫోన్​ నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్బాంగాలో పార్సిల్​ను రైల్లోంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు...

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్​కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ.. ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: NIA: దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.