ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్.. సీమ జిల్లాలు అతలాకుతలం

author img

By

Published : Nov 29, 2020, 7:42 AM IST

రైతన్నల కష్టాన్ని నీళ్లపాలు జేసింది నివర్‌ తుపాను. ఏపీలో అన్నదాతల ఆశల్ని నిండా ముంచింది. చాలా గ్రామాలు జలమయం కాగా... వరి, పత్తి, మిరప, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. కరవుకు నిలయమైన రాయలసీమ జిల్లాలను నివర్‌ తుపాను వణికించింది. వాన చుక్కకోసం ఆకాశం వైపు ఎదరుచూసే సీమ ప్రజలను వరుణుడు ముంచెత్తాడు. ఆ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా రాయలసీమ వ్యాప్తంగా కురిసిన వర్షాలు.. సీమ జిల్లాలను అతలాకుతలం చేశాయి.

never-affect-rayalaseema-districts-are-horrible in andhra pradesh
నివర్ ఎఫెక్ట్.. సీమ జిల్లాలు అతలాకుతలం
నివర్ ఎఫెక్ట్.. సీమ జిల్లాలు అతలాకుతలం

నివర్‌ తుపాను ప్రభావంతో 3రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చిత్తూరు, కడప జిల్లాలను గడగడలాడించాయి. కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు వందల పూరిగుడిసెలను నేలమట్టం చేశాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. వరదనీరు పరుగులెత్తిన వాగులు, వంకల్లో పడి 8మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అరుగురు, కడప జిల్లాలో ఇద్దరు నివర్‌ తుపాను తాకిడికి మృతి చెందారు. నీటి చుక్క ఎరుగని జలాశయాలు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గేట్లు దూకి వరద ఉద్ధృతంగా ప్రవహించింది. వరద ధాటికి సాగునీటి ప్రాజెక్ట్‌ల గట్లు తెగి వేల క్యూసెక్‌ల నీరు సముద్రం పాలైంది.

చిగురుటాకులా చిత్తూరు

నివర్‌ ధాటికి చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వేల ఎకరాల పంట నీట మునిగింది. 12 మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లాలోని గార్గేయ, నీవా, స్వర్ణముఖి, అరుణా, పింఛా నదులు పొంగిపొర్లాయి. ఆయా నదులపై నిర్మించిన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. వరదనీరు నిర్వహణలో భాగంగా జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో అరుణానదిపై నిర్మించిన అరణియార్‌ జలాశయం గేట్లు ఎత్తి వేల క్యూసెక్‌ల నీరు కిందకు వదిలారు.

పంటలు జలమయం

తుపాను వల్ల కురిసిన భారీ వానలకు శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మధ్య 2రోజుల పాటు రాక పోకలు స్తంభించాయి. కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వచ్చిన నీరు.. వేల ఎకరాల పంటను ముంచింది. రేణిగుంట సమీపంలో మల్లెమడుగు జలాశయం నుంచి వచ్చిన నీటిలో చిక్కుకొని ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. గార్గేయనదిలో పడి ఇద్దరు విగతజీవులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 523 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 32 కల్వర్టులు కోతకు గురయ్యాయి. వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు చనిపోయాయి. చిత్తూరు జిల్లాలో ప్రాథమికంగా 24 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అత్యధికంగా 19వేల ఎకరాల వరిపంట నీటమునిగింది. వేరుశనగ, టమోటాతో పాటు అపరాల పంటలు నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కడపపై నివర్

నివర్‌ తుపాను కడప జిల్లాపైన తీవ్ర ప్రభావం చూపింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. సుండుపల్లె వద్ద నున్న పింఛా జలాశయానికి వరద పోటెత్తడంతో కుడిగట్టు 50 మీటర్ల మేర తెగిపోయింది. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరింది. లక్షా ఇరవై వేల క్యూసెక్‌ల ప్రవాహం ఒక్కసారిగా అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.

స్తంభించిన రాకపోకలు

సి.కె.దిన్నె బుగ్గవంక జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో... నీటిని కిందకు వదలడంతో కడప నగరాన్ని వరద ముంచెత్తింది. నాగరాజుపేట, రవీంద్రనగర్‌, బాలాజీ నగర్‌, నబీకోట, గుర్రాలగడ్డ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రైల్వేకోడూరు వద్ద గుంజనేరు వాగు పొంగిపొర్లింది. తిరుపతి-కడప మధ్య రాకపోకలు స్తంభించాయి. రాయచోటి, బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లుపడ్డాయి. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి పంటలు సాగుచేసిన రైతులు నిండా మునిగారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో వరి పంట నేలపాలైంది.

భారీ నష్టం...

కర్నూలు జిల్లాలో నివర్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు, రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో 15,788 హెక్టార్లలో వ్యవసాయ, 479 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం కలిగినట్లు అధికారులు ప్రకటించారు. వరి, జొన్న, పత్తి, మినుము, పప్పు శనగ, వేరుశనగ, అరటి, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు నష్టం జరిగింది. జిల్లాలో 42 గొర్రెలు, మేకలు మృతి చెందగా... 35 ఇళ్లు పాక్షికంగా... చాగలమర్రి, ఆళ్లగడ్డల్లో 3.4 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వేరుశనగ పంట నీట మునిగింది.

అతలాకుతలమైన నెల్లూరు

నివర్‌ తుపాను ధాటికి బాగా దెబ్బతిని... తీవ్రంగా నష్టపోయిన జిల్లా నెల్లూరు. వరదనీటికి సింహాపురి అతలాకుతలమైంది. నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంటలపై ఇప్పటికే రైతులు ఆశలు వదిలేయగా... పలుచోట్ల చెరువు గట్లు తెగి మెట్టప్రాంతాల్లో పొలాలూ నీటమునిగాయి. పెన్నా, స్వర్ణముఖి నదుల తీరాలు క్రమంగా కోతకు గురవటం ఆందోళన కలిగిస్తోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండగా... రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాకు ఆహ్లాదాన్ని పంచే పెన్నానది తీరంలో వరద కల్లోలం రేగింది. పెన్నాకు వరద పోటెత్తడంతో నెల్లూరు నగరంతోపాటు సమీప గ్రామాలు, వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

స్వర్ణముఖి ఉగ్రరూపం...

స్వర్ణముఖి నది ఉగ్రరూపంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. వ్యవసాయ మోటార్లు, తాగునీటి పథకాల పైపులైన్లు కొట్టుకుపోయాయి. నదిపొడవునా రూ.కోట్ల వ్యయంతో జరుగుతున్న పొర్లుకట్ట పనులు పూర్తికాక... పొలాల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. 32 మండలాల్లో సుమారు రూ.43 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా నదికి వరద పోటెత్తింది. సోమశిల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 3 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముండటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులో జాతీయ రహదారితోపాటు... గ్రామాల మధ్య రహదారుల్లో చాలావరకు జలమయమయ్యాయి. కాలువలు, వాగుల ఉద్ధృతితో రహదారులపై రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారిపైకి వరదనీరు రావటంతో.. చెన్నై-నెల్లూరు దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది.

ఏపీ సీఎం సమీక్ష

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను.. విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలు, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన ఏపీ సీఎం జగన్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా 3 జిల్లాల నివేదికలు అందజేశారు. డిసెంబర్ 15లోపు పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి డిసెంబర్ 30లోపు పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండీ: ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భాజపా

నివర్ ఎఫెక్ట్.. సీమ జిల్లాలు అతలాకుతలం

నివర్‌ తుపాను ప్రభావంతో 3రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చిత్తూరు, కడప జిల్లాలను గడగడలాడించాయి. కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు వందల పూరిగుడిసెలను నేలమట్టం చేశాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. వరదనీరు పరుగులెత్తిన వాగులు, వంకల్లో పడి 8మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అరుగురు, కడప జిల్లాలో ఇద్దరు నివర్‌ తుపాను తాకిడికి మృతి చెందారు. నీటి చుక్క ఎరుగని జలాశయాలు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గేట్లు దూకి వరద ఉద్ధృతంగా ప్రవహించింది. వరద ధాటికి సాగునీటి ప్రాజెక్ట్‌ల గట్లు తెగి వేల క్యూసెక్‌ల నీరు సముద్రం పాలైంది.

చిగురుటాకులా చిత్తూరు

నివర్‌ ధాటికి చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వేల ఎకరాల పంట నీట మునిగింది. 12 మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లాలోని గార్గేయ, నీవా, స్వర్ణముఖి, అరుణా, పింఛా నదులు పొంగిపొర్లాయి. ఆయా నదులపై నిర్మించిన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి. వరదనీరు నిర్వహణలో భాగంగా జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో అరుణానదిపై నిర్మించిన అరణియార్‌ జలాశయం గేట్లు ఎత్తి వేల క్యూసెక్‌ల నీరు కిందకు వదిలారు.

పంటలు జలమయం

తుపాను వల్ల కురిసిన భారీ వానలకు శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మధ్య 2రోజుల పాటు రాక పోకలు స్తంభించాయి. కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వచ్చిన నీరు.. వేల ఎకరాల పంటను ముంచింది. రేణిగుంట సమీపంలో మల్లెమడుగు జలాశయం నుంచి వచ్చిన నీటిలో చిక్కుకొని ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. గార్గేయనదిలో పడి ఇద్దరు విగతజీవులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 523 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 32 కల్వర్టులు కోతకు గురయ్యాయి. వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు చనిపోయాయి. చిత్తూరు జిల్లాలో ప్రాథమికంగా 24 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అత్యధికంగా 19వేల ఎకరాల వరిపంట నీటమునిగింది. వేరుశనగ, టమోటాతో పాటు అపరాల పంటలు నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కడపపై నివర్

నివర్‌ తుపాను కడప జిల్లాపైన తీవ్ర ప్రభావం చూపింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. సుండుపల్లె వద్ద నున్న పింఛా జలాశయానికి వరద పోటెత్తడంతో కుడిగట్టు 50 మీటర్ల మేర తెగిపోయింది. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరింది. లక్షా ఇరవై వేల క్యూసెక్‌ల ప్రవాహం ఒక్కసారిగా అన్నమయ్య ప్రాజెక్ట్‌లోకి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.

స్తంభించిన రాకపోకలు

సి.కె.దిన్నె బుగ్గవంక జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో... నీటిని కిందకు వదలడంతో కడప నగరాన్ని వరద ముంచెత్తింది. నాగరాజుపేట, రవీంద్రనగర్‌, బాలాజీ నగర్‌, నబీకోట, గుర్రాలగడ్డ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రైల్వేకోడూరు వద్ద గుంజనేరు వాగు పొంగిపొర్లింది. తిరుపతి-కడప మధ్య రాకపోకలు స్తంభించాయి. రాయచోటి, బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లుపడ్డాయి. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి పంటలు సాగుచేసిన రైతులు నిండా మునిగారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో వరి పంట నేలపాలైంది.

భారీ నష్టం...

కర్నూలు జిల్లాలో నివర్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు, రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో 15,788 హెక్టార్లలో వ్యవసాయ, 479 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం కలిగినట్లు అధికారులు ప్రకటించారు. వరి, జొన్న, పత్తి, మినుము, పప్పు శనగ, వేరుశనగ, అరటి, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు నష్టం జరిగింది. జిల్లాలో 42 గొర్రెలు, మేకలు మృతి చెందగా... 35 ఇళ్లు పాక్షికంగా... చాగలమర్రి, ఆళ్లగడ్డల్లో 3.4 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వేరుశనగ పంట నీట మునిగింది.

అతలాకుతలమైన నెల్లూరు

నివర్‌ తుపాను ధాటికి బాగా దెబ్బతిని... తీవ్రంగా నష్టపోయిన జిల్లా నెల్లూరు. వరదనీటికి సింహాపురి అతలాకుతలమైంది. నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంటలపై ఇప్పటికే రైతులు ఆశలు వదిలేయగా... పలుచోట్ల చెరువు గట్లు తెగి మెట్టప్రాంతాల్లో పొలాలూ నీటమునిగాయి. పెన్నా, స్వర్ణముఖి నదుల తీరాలు క్రమంగా కోతకు గురవటం ఆందోళన కలిగిస్తోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండగా... రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాకు ఆహ్లాదాన్ని పంచే పెన్నానది తీరంలో వరద కల్లోలం రేగింది. పెన్నాకు వరద పోటెత్తడంతో నెల్లూరు నగరంతోపాటు సమీప గ్రామాలు, వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

స్వర్ణముఖి ఉగ్రరూపం...

స్వర్ణముఖి నది ఉగ్రరూపంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. వ్యవసాయ మోటార్లు, తాగునీటి పథకాల పైపులైన్లు కొట్టుకుపోయాయి. నదిపొడవునా రూ.కోట్ల వ్యయంతో జరుగుతున్న పొర్లుకట్ట పనులు పూర్తికాక... పొలాల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. 32 మండలాల్లో సుమారు రూ.43 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా నదికి వరద పోటెత్తింది. సోమశిల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 3 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముండటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులో జాతీయ రహదారితోపాటు... గ్రామాల మధ్య రహదారుల్లో చాలావరకు జలమయమయ్యాయి. కాలువలు, వాగుల ఉద్ధృతితో రహదారులపై రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారిపైకి వరదనీరు రావటంతో.. చెన్నై-నెల్లూరు దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది.

ఏపీ సీఎం సమీక్ష

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను.. విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలు, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన ఏపీ సీఎం జగన్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా 3 జిల్లాల నివేదికలు అందజేశారు. డిసెంబర్ 15లోపు పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి డిసెంబర్ 30లోపు పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండీ: ప్రచారంలో మరింత దూకుడు పెంచిన భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.