ETV Bharat / state

తల్లిని పోషించలేక హత్య చేసిన కొడుకు, కోడలు

కన్నతల్లిని భార్యతో కలిసి హత్య చేసి, సహజ మరణంగా చిత్రకరించిన భార్యభర్తలు జైలుపాలైన ఘటన చంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది.

author img

By

Published : Aug 20, 2019, 6:00 AM IST

Updated : Aug 20, 2019, 7:51 AM IST

తల్లిని పోషించలేక హత్య చేసిన కొడుకు,కోడలు

తల్లిని పోషించలేక కొడుకు, కోడలు కలసి హత్య చేసిన ఘటన హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్టలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న ఖైరున్నిసా అనే వృద్ధురాలు మరణించింది. ఆమె మరణంపై ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు మృతురాలి ఇంటికెళ్లి పరిశీలించారు. అనుమానం రావడం వల్ల శవ పరీక్ష చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమినట్లు, బలంగా తలను గోడకు కొట్టి చంపినట్లుగా తేలింది. కొడుకు చాంద్ పాషా, అతని భార్య కౌసర్ బేగంను విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. ఖైరున్నిసాను పోషించలేక దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేసినట్లు ఫలక్​నుమా ఏసీపీ ఎమ్​ఏ రషీద్ తెలిపారు.

తల్లిని పోషించలేక హత్య చేసిన కొడుకు,కోడలు

ఇదీ చూడండి : ఆరోగ్యశ్రీ బంద్​... 'గాంధీ'లో కిటకిట

తల్లిని పోషించలేక కొడుకు, కోడలు కలసి హత్య చేసిన ఘటన హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్టలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న ఖైరున్నిసా అనే వృద్ధురాలు మరణించింది. ఆమె మరణంపై ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు మృతురాలి ఇంటికెళ్లి పరిశీలించారు. అనుమానం రావడం వల్ల శవ పరీక్ష చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమినట్లు, బలంగా తలను గోడకు కొట్టి చంపినట్లుగా తేలింది. కొడుకు చాంద్ పాషా, అతని భార్య కౌసర్ బేగంను విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. ఖైరున్నిసాను పోషించలేక దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేసినట్లు ఫలక్​నుమా ఏసీపీ ఎమ్​ఏ రషీద్ తెలిపారు.

తల్లిని పోషించలేక హత్య చేసిన కొడుకు,కోడలు

ఇదీ చూడండి : ఆరోగ్యశ్రీ బంద్​... 'గాంధీ'లో కిటకిట

Intro:కన్నతల్లిని భార్యతో కలిసి హత్య చేసి సహజ
మరణంగా చిత్రకరిస్తూ భార్యభర్త జైల్ పాలు అయిన ఘటన హైదరాబాద్ చంద్రాయనగుట్టలో చోటు చేసుకుంది.

30 మార్చ్ 20 19 నాడు హాశమబాద్ ప్రాంతంలో కైరున్నిసా అనే మృతి చెందిన వృద్ధురాలి మృతి పై అనుమానం ఉంది అని వారి కుటుంబ సభ్యులు ఆమె అంతక్రియలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఓ అజ్ఞాత వ్యక్తి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హాశమబాద్ లోని మృతురాలి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశ్కించగా మృతి పై అనుమానం రావడంతో మృతురాలి కొడుకు చాంద్ పాషా తో ఫిర్యాదు తీసుకొని శవ పరీక్ష చేయించారు.
పోస్టుమార్టం రిపోర్టులో మృతురాలి పై గొంతు నులిమిన ఆనవాళ్లు, మరియు బలంగా గోడకు తలను కొట్టిన ఆధారాలు ఉండటంతో అనుమనంతో కొడుకు చాంద్ పాషా,అతని భార్య కౌసర్ బేగం ను పోలిసులు విచారించగా తామే ఈ హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు అని మృతురాలిని పోషించలేక కారణంతో హత్య చేసినట్లు, నిందితులు మృతురాలు కైరిన్నిసాను బలంగా పలు సార్లు గోడకు గుద్ధి పిదప చనిపోయిందో లేదో అని అనుమానం తో గొంతు నులిమి హత్య చేశారు అని వారిని ఈ రోజు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ఫలక్ నుమ ma రషీద్ తెలిపారు.
బైట్.. ma రషీద్ ఏసీపీ ఫలక్ నుమBody:చాంద్రాయణగుట్టConclusion:Md సుల్తాన్ 9394450285
Last Updated : Aug 20, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.