ETV Bharat / state

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్​ అధికారుల కొరడా

గ్రామ పంచాయతీల పేరుతో తీసుకున్న అనుమతులు ద్వారా నిర్మిస్తున్న కట్టడాలను శంషాబాద్​లో మున్సిపల్​ అధికారులు కూల్చేశారు. జీవో 111 అమలులో ఉన్నందున ఇక్కడ ప్లాట్లకు ఎలాంటి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు నోటీసులిచ్చినా నిర్మాణదారులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 24, 2019, 10:12 AM IST

అక్రమ నిర్మాణాలు
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్​ అధికారుల కొరడా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఆక్రమనిర్మాణలపై మున్సిపల్​ అధికారులు కొరడా ఝళిపించారు. గతంలో గ్రామ పంచాయతీల పేరుతో అనుమతులు పొంది అదే పేరుతో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వాటిని కూల్చేశారు. యజమానులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరించారు.

నోటీసులిచ్చినా స్పందించలేదు

శంషాబాద్​ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40 భవనాలకు గ్రామ పంచాయతీల పేరుతో తీసుకున్న అనుమతులు చెల్లవంటూ గతంలో నోటీసులిచ్చినా... నిర్మాణ దారులు స్పందించలేదని అధికారులు తెలిపారు. జీవో 111 అమలులో ఉన్నందున అక్రమ లే అవుట్​ల నిర్మాణం చేపడితే క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి నిర్మాణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శంషాబాద్​ పరిధిలో ప్లాట్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : జలకళ సంతరించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలు

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్​ అధికారుల కొరడా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఆక్రమనిర్మాణలపై మున్సిపల్​ అధికారులు కొరడా ఝళిపించారు. గతంలో గ్రామ పంచాయతీల పేరుతో అనుమతులు పొంది అదే పేరుతో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వాటిని కూల్చేశారు. యజమానులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరించారు.

నోటీసులిచ్చినా స్పందించలేదు

శంషాబాద్​ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40 భవనాలకు గ్రామ పంచాయతీల పేరుతో తీసుకున్న అనుమతులు చెల్లవంటూ గతంలో నోటీసులిచ్చినా... నిర్మాణ దారులు స్పందించలేదని అధికారులు తెలిపారు. జీవో 111 అమలులో ఉన్నందున అక్రమ లే అవుట్​ల నిర్మాణం చేపడితే క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలాంటి నిర్మాణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శంషాబాద్​ పరిధిలో ప్లాట్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : జలకళ సంతరించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలు

Intro:JK_TG_NLG_111_24_Water_storage_Pkg_TS10102 ( ) నీటి నిల్వ.....గుంటలతో పంటల సాగు కాలం మారుతోంది ....కాలక్రమేణా జరిగే జరిగే ప్రకృతి లో మార్పులతో ....కర్షకుడు కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి......ఆశతో పెంచుకున్న తమ పంట పొలాలు ....ప్రకృతి కోపంతో తమ కళ్ళ ముందు ఎండిపోతుంటే కర్షకుని కి కన్నీరే మిగిలింది..... ఈ కరువును జయించాలనే ఆశయం తో తమకున్న తక్కువ నీటినిఎప్పటికప్పుడు పంట పొలాలకు వదలకుండా ఆ తక్కువ నీటిని అంతా ఒక చోట నిల్వ చేసుకుని వాడుకునే పద్ధతి ని ఎంచుకున్నారు ఆ ప్రాంత రైతులు. look నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచాలపురం గ్రామంలోని రైతులంతా వ్యవసాయం పై ఆధారపడే జీవించే సన్న చిన్నకారు రైతులే .వీరు ప్రధానంగా సాగు చేసే పంట నిమ్మతోటలు ఈ నిమ్మతోటల నుండి వచ్చే ఆదాయంతోనే ఆ రైతుల కుటుంబాలు గడిచేవి తమ కుటుంబాలు గడవడమే కాకుండా ఇంకా కొంత మంది కూలీలకు ఉపాధి కల్పించే వారని అలాంటిది ఇప్పుడు ఆ తోటలు కళ్ళముందే ఎండిపోతుంటే ఈ పాంపౌండ్ గుంటల కు శ్రీకారం చుట్టారు అరైతులు. రెండు సంవత్సరాలు గా వర్షాలు సరిగా కురావకపోవడంతో పాటు దానికి తోడు 24 గంటల విద్యుత్ సరఫరా కావడంతో బోర్ల ద్వారా బావుల ద్వారా భూమిలో నీటిని మొత్తం తోడేస్తున్నారు.దీంతో క్రమ క్రమంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. సొంత నిధులతో నీటి గుంటలు (పాంపౌండ్) క్రమ క్రమంగా భూగర్భజలాలు తగ్గిపోతుండంతో ఒకప్పుడు రెండు మూడు రోజులు 100 నిమ్మ చెట్లకు నీళ్లు అందించే వారు ఇప్పుడు భూగర్భజలలు తగ్గిపోవడంవల్ల 20 రోజులైనా నీటిని అందించాలేక పోతున్నామని .బోరు నుండి వచ్చే తక్కువ నీటిని ఎప్పటికప్పుడు వాడుకొని వృధా చేయకుండా నీరంతా ఒక చోట నిల్వ చేసుకునేందుకు వీలుగా తమ పొలంలో జేసిబి సహాయంతో గుంతను తవ్వి అందులో ఒక ప్లాస్టీక్ కవర్ ను పరిచి తమ బోరు నుండి వచ్చే కొద్దిపాటి నీటి ఇందులో రెండు మూడు రొజు లలో నింపి తర్వాత మోటార్ ద్వారా పంటపొలాలకు పారిస్తున్నారు దీని ద్వారా రైతుల సమయం కూడా ఆదా అవుతుందని ఆ రైతులు చెబుతున్నారు. ఈ విధంగా ఆ గ్రామంలో ఇప్పటి వరకు 40 మంది రైతులు ఇదే పద్దతిని తమ సొంత ఖర్చులతో సాగుచేస్తున్నారు.... ప్రభుత్వం చొరవతో రైతులకు ప్రయోజనం చేకూర్చాలి ఇలాంటి వాటిపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించి రాయితీల ద్వారా ఇదేవిధంగా రైతులందరు సాగుకు ప్రోత్సహించాలని ఆప్రాంత రైతులు కోరుతున్నారు.


Body:మునుగోడు నియోజకవర్గం నల్లగొండ జిల్లా


Conclusion:పరమేష్ బొల్లం 9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.