ETV Bharat / state

తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్

author img

By

Published : Feb 28, 2021, 4:44 PM IST

ప్రభుత్వ ఉదాసీనత వల్లే శనగ రైతులు నష్టపోతున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ మొత్తం దళారుల గుప్పిట్లోకి పోయిందని వ్యాఖ్యానించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

mp revanth reddy letter to cm kcr on purchasing centers
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: ఎంపీ రేవంత్

రాష్ట్రంలో రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర కల్పించాలని.. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. మార్కెట్​ మొత్తం దళారుల గుప్పిట్లోకి పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. మార్కెట్ పూర్తిగా దళారుల చేతులోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో శనగ రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... కనీసం మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర కల్పించాలని.. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. మార్కెట్​ మొత్తం దళారుల గుప్పిట్లోకి పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. మార్కెట్ పూర్తిగా దళారుల చేతులోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఈ క్రమంలో శనగ రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... కనీసం మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​ రైతు వెంకట్​రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.