ETV Bharat / state

ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య

author img

By

Published : Sep 11, 2020, 7:14 PM IST

కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీ చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో జరిగింది.

ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య

ఏపీలోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె... తన ఇద్దరు కుమారులతో సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గమనించిన స్థానిక రైతులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె... తన ఇద్దరు కుమారులతో సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గమనించిన స్థానిక రైతులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'మహా' విలయం- కొత్తగా 23,446 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.