ETV Bharat / state

Money Double Fraud in Hyderabad : డబ్బులు డబుల్​ చేసిస్తా.. నమ్మితే ఇలాగే అవుతది మరి..! - తెలంగాణ న్యూస్​

Money Fraud By African in Hyderabad : మన వద్ద ఉన్న కరెన్సీ నోట్లు చిన్న మ్యాజిక్ చేస్తే రెట్టింపు అవుతాయంటే ఎలా ఉంటుంది.. ఎగిరి గంతేస్తాం. చేసిన వారికి అందులో సగం డబ్బు ఇవ్వడానికైనా వెనకాడం. ఇలా కరెన్సీని రెట్టింపు చేస్తామని చెప్పిన వారిని నమ్మితే మీరు మోసపోయినట్లే. ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో ఓ ఆఫ్రికన్ దేశస్తుడు.. ఇద్దరిని బురడీ కొట్టించాడు. కరెన్సీ రెట్టింపు అవుతుందని కెమికల్ రియాక్షన్ పేరుతో రూ.లక్షలు కాజేసిన నేరగాడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

Money Double Fraud in Hyderabad
Money Double Fraud in Hyderabad
author img

By

Published : Jul 4, 2023, 10:58 AM IST

Updated : Jul 4, 2023, 11:51 AM IST

డబ్బలు డబల్​ చేస్తానంటుూ మోసం చేస్తున్న ఆఫ్రిక్​

Money Fraud in Hyderabad by African : డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేక చెడు మార్గమా అన్నది ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలి.. సెటిల్ అవ్వాలని కొందరు చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. చివరకు కటకటాలపాలవుతున్నారు. ఇదే సమయంలో డబ్బుపై ఉన్న ఆకర్షణను ఆసరా చేసుకుంటూ కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రకం నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వండి.. వాటిని డబుల్​ చేస్తామని వారి ముందే చిన్నగా చేసి చూపితే ఎవ్వరూ నమ్మరు. అదే.. రూ.లక్షల్లో డబ్బులు డబుల్​ చేసి ఇస్తామంటే ఇట్టే నమ్మేస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్​లో ఇద్దరిని బురడీ కొట్టించిన ఆఫ్రికన్​ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

వెస్ట్ ఆఫ్రికా ఐవెరీ కోస్ట్​కు చెందిన జోన్​గుయే రోస్టండ్‌ అలియాస్ డౌడ.. బిజినెస్ వీసాపై 2021లో హైదరాబాద్​కు వచ్చాడు. సన్​సిటీలో నివాసం ఉంటూ విలాసాలకు అలవాటుపడ్డాడు. గతేడాది జనవరిలోనే ఇతని వీసా గడువు ముగిసింది. అయినా.. అక్రమంగా ఇక్కడే నివాసం ఉంటూ పలు రకాల మోసాలు చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద ఉన్న శక్తితో కరెన్సీ నోట్లను డబుల్ చేస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇదే క్రమంలో గత నెలలో మాదాపూర్​కు చెందిన ఓ వ్యాపారిని కలిసిన జోన్‌.. అతని వద్ద ఉన్న రూ.25 లక్షలను రూ.50 లక్షలు చేస్తానని మోసగించి ఉడాయించాడు. తాజాగా ఎల్బీనగర్​కు చెందిన మరో బాధితుడిని మోసం చేసేందుకు ప్రయత్నించగా ఎల్బీనగర్ ఎస్‌వోటి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే నకిలీ రూ.5 వందల నోట్లు, 5 కెమికల్ బాటిళ్లు, కెమికల్ పౌడర్లు, పాస్‌ పోర్ట్‌ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

African Money Fraud in Hyderabad : నిందితుడు జోన్‌ కేవలం వ్యాపారస్థులు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని.. సంప్రదించిన వారిని తన హస్త లాఘవంతో బురిడీ కొట్టిస్తున్నాడు. ముందుగా నమ్మించేందుకు నిందితుడు తన ఎడమ చేతిలో అసలైన రెండు రూ.5 వందల నోట్లను పెట్టుకుంటాడు. బాధితుల నుంచి ఒక ఐదు వందల నోటు తీసుకుంటాడు. ఆ నోటును రెండు తెల్ల పేపర్ల మధ్యలో పెడతాడు. వాటికి అయోడిన్‌, ఇతర కెమికల్స్​ను పూస్తాడు. అనంతరం దాన్ని ఎన్వలప్ కవర్​లో పెడుతున్నాడు. బాధితుడిని కొంచెం సేపు ఆగమని చెప్పి దాన్ని నీటితో ఉన్న మగ్గులో పెడతాడు. అదే సమయంలో బాధితుడి దృష్టి మరల్చి తన ఎడమ చేతిలో ఉన్న రెండు 5 వందల నోట్లను మగ్గులో పడేస్తాడు. వాటిని బాధితుడికి ఇస్తున్నాడు. ఇదంతా చూసి నిజమేనని నమ్ముతున్న బాధితులు.. అధిక మొత్తంలో డబ్బును అతనికి ఇచ్చి రెట్టింపు చేయమని చెబుతున్నారు.

ఇదే క్రమంలో మాదాపూర్​కు చెందిన ఆదర్ష్ అనే వ్యాపారి..జోన్​కు రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన నగదును అట్లల్లో పెట్టాడు. తన వద్ద ఉన్న నకిలీ నోట్లు, కొన్ని తెల్ల పేపర్లను కూడా అట్టలో పెట్టాడు. వాటికి తన వద్ద ఉన్న కెమికల్ పౌడర్ పూసి ఊదాడు. దీంతో బాధితుడికి కళ్లు మండాయి. కళ్లు నలుచుకుని చూసేలోపు అసలైన నగదును తీసుకున్న జోన్.. అందులో నకీలీ నోట్లు పెట్టాడు. కెమికల్ రియాక్షన్ జరుగుతుందని.. 4, 5 గంటల పాటు తెరవకూడదని చెప్పి జోన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అట్టను తెరచి డబ్బులు చూసుకున్న బాధితుడు ఆదర్ష్ మోసమని గ్రహించి మాదాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఎల్బీనగర్​కు చెందిన బాధితుడి నుంచి రూ.10 లక్షలు కాజేసేందుకు జోన్ ప్రయత్నిస్తుండగా.. ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డబ్బులు రెట్టింపు చేయడం అనేది జరగని పని అని.. ఇలా సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరగాళ్లు ఎత్తులు వేస్తారని.. ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

డబ్బలు డబల్​ చేస్తానంటుూ మోసం చేస్తున్న ఆఫ్రిక్​

Money Fraud in Hyderabad by African : డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేక చెడు మార్గమా అన్నది ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలి.. సెటిల్ అవ్వాలని కొందరు చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. చివరకు కటకటాలపాలవుతున్నారు. ఇదే సమయంలో డబ్బుపై ఉన్న ఆకర్షణను ఆసరా చేసుకుంటూ కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రకం నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వండి.. వాటిని డబుల్​ చేస్తామని వారి ముందే చిన్నగా చేసి చూపితే ఎవ్వరూ నమ్మరు. అదే.. రూ.లక్షల్లో డబ్బులు డబుల్​ చేసి ఇస్తామంటే ఇట్టే నమ్మేస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్​లో ఇద్దరిని బురడీ కొట్టించిన ఆఫ్రికన్​ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

వెస్ట్ ఆఫ్రికా ఐవెరీ కోస్ట్​కు చెందిన జోన్​గుయే రోస్టండ్‌ అలియాస్ డౌడ.. బిజినెస్ వీసాపై 2021లో హైదరాబాద్​కు వచ్చాడు. సన్​సిటీలో నివాసం ఉంటూ విలాసాలకు అలవాటుపడ్డాడు. గతేడాది జనవరిలోనే ఇతని వీసా గడువు ముగిసింది. అయినా.. అక్రమంగా ఇక్కడే నివాసం ఉంటూ పలు రకాల మోసాలు చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద ఉన్న శక్తితో కరెన్సీ నోట్లను డబుల్ చేస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇదే క్రమంలో గత నెలలో మాదాపూర్​కు చెందిన ఓ వ్యాపారిని కలిసిన జోన్‌.. అతని వద్ద ఉన్న రూ.25 లక్షలను రూ.50 లక్షలు చేస్తానని మోసగించి ఉడాయించాడు. తాజాగా ఎల్బీనగర్​కు చెందిన మరో బాధితుడిని మోసం చేసేందుకు ప్రయత్నించగా ఎల్బీనగర్ ఎస్‌వోటి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే నకిలీ రూ.5 వందల నోట్లు, 5 కెమికల్ బాటిళ్లు, కెమికల్ పౌడర్లు, పాస్‌ పోర్ట్‌ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

African Money Fraud in Hyderabad : నిందితుడు జోన్‌ కేవలం వ్యాపారస్థులు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని.. సంప్రదించిన వారిని తన హస్త లాఘవంతో బురిడీ కొట్టిస్తున్నాడు. ముందుగా నమ్మించేందుకు నిందితుడు తన ఎడమ చేతిలో అసలైన రెండు రూ.5 వందల నోట్లను పెట్టుకుంటాడు. బాధితుల నుంచి ఒక ఐదు వందల నోటు తీసుకుంటాడు. ఆ నోటును రెండు తెల్ల పేపర్ల మధ్యలో పెడతాడు. వాటికి అయోడిన్‌, ఇతర కెమికల్స్​ను పూస్తాడు. అనంతరం దాన్ని ఎన్వలప్ కవర్​లో పెడుతున్నాడు. బాధితుడిని కొంచెం సేపు ఆగమని చెప్పి దాన్ని నీటితో ఉన్న మగ్గులో పెడతాడు. అదే సమయంలో బాధితుడి దృష్టి మరల్చి తన ఎడమ చేతిలో ఉన్న రెండు 5 వందల నోట్లను మగ్గులో పడేస్తాడు. వాటిని బాధితుడికి ఇస్తున్నాడు. ఇదంతా చూసి నిజమేనని నమ్ముతున్న బాధితులు.. అధిక మొత్తంలో డబ్బును అతనికి ఇచ్చి రెట్టింపు చేయమని చెబుతున్నారు.

ఇదే క్రమంలో మాదాపూర్​కు చెందిన ఆదర్ష్ అనే వ్యాపారి..జోన్​కు రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన నగదును అట్లల్లో పెట్టాడు. తన వద్ద ఉన్న నకిలీ నోట్లు, కొన్ని తెల్ల పేపర్లను కూడా అట్టలో పెట్టాడు. వాటికి తన వద్ద ఉన్న కెమికల్ పౌడర్ పూసి ఊదాడు. దీంతో బాధితుడికి కళ్లు మండాయి. కళ్లు నలుచుకుని చూసేలోపు అసలైన నగదును తీసుకున్న జోన్.. అందులో నకీలీ నోట్లు పెట్టాడు. కెమికల్ రియాక్షన్ జరుగుతుందని.. 4, 5 గంటల పాటు తెరవకూడదని చెప్పి జోన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అట్టను తెరచి డబ్బులు చూసుకున్న బాధితుడు ఆదర్ష్ మోసమని గ్రహించి మాదాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఎల్బీనగర్​కు చెందిన బాధితుడి నుంచి రూ.10 లక్షలు కాజేసేందుకు జోన్ ప్రయత్నిస్తుండగా.. ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డబ్బులు రెట్టింపు చేయడం అనేది జరగని పని అని.. ఇలా సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరగాళ్లు ఎత్తులు వేస్తారని.. ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 4, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.