ETV Bharat / state

'పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలి'

author img

By

Published : Jan 3, 2021, 1:09 PM IST

రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్​.. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వల్ల ప్రజలకు రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.

gosha mahal, mla rajasingh, dump on road sides
గోషామహల్​, ఎమ్మెల్యే రాజాసింగ్​

గోషామహల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్.. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు​ విజ్ఞప్తి చేశారు. రహదారుల పక్కన చెత్త పేరుకుపోవటంతో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులతో పాటు కమిషనర్​కు చెత్త సమస్య గురించి తెలిపినా వారినుంచి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు కొవిడ్​తో ప్రజలు భయాందోళనలో ఉన్నారని.. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చెత్తను తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు.

గోషామహల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్.. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు​ విజ్ఞప్తి చేశారు. రహదారుల పక్కన చెత్త పేరుకుపోవటంతో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులతో పాటు కమిషనర్​కు చెత్త సమస్య గురించి తెలిపినా వారినుంచి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు కొవిడ్​తో ప్రజలు భయాందోళనలో ఉన్నారని.. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చెత్తను తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి: అధికార ఠీవికి నిదర్శనంగా నిలిచిన వాహనాల వేలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.