ETV Bharat / state

ఏపీలో అదృశ్యమై మధ్యప్రదేశ్​లో తేలాడు.. ఆరేళ్లకు ఇంటికి చేరాడు! - ap news

న్యాయ సేవా అధికారులు ఓ కుటుంబంలో ఆనందం నింపారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తిని అతని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో జరిగింది.

after 6 years return back to home
ఏపీలో అదృశ్యమై మధ్యప్రదేశ్​లో తేలాడు.. ఆరేళ్లకు ఇంటికి చేరాడు!
author img

By

Published : Nov 2, 2020, 10:15 PM IST

మానసిక వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి ఆరేళ్ల క్రితం వెళ్లిపోయిన ఓ వ్యక్తిని ఏపీలోని గుంటూరు జిల్లా న్యాయ సేవా అధికారులు కుటుంబం చెంతకు చేర్చారు. జిల్లా న్యాయమూర్తి గోపీచంద్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అతన్ని సోమవారం అప్పగించారు.

గుంటూరులోని గోరంట్లకు చెందిన శివనాగరాజు... ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి మధ్యప్రదేశ్​లోని బిలాస్​పూర్ వెళ్లిపోయాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఆయనను.. అక్కడ పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత అతను తన చిరునామా చెప్పటంతో అక్కడి అధికారులు గుంటూరు న్యాయ సేవా అధికారులకు సమాచారం అందించారు.

న్యాయ సేవా అధికారులు... శివనాగరాజు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగరాజు తిరిగి రావటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో అదృశ్యమై మధ్యప్రదేశ్​లో తేలాడు.. ఆరేళ్లకు ఇంటికి చేరాడు!

ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

మానసిక వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి ఆరేళ్ల క్రితం వెళ్లిపోయిన ఓ వ్యక్తిని ఏపీలోని గుంటూరు జిల్లా న్యాయ సేవా అధికారులు కుటుంబం చెంతకు చేర్చారు. జిల్లా న్యాయమూర్తి గోపీచంద్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అతన్ని సోమవారం అప్పగించారు.

గుంటూరులోని గోరంట్లకు చెందిన శివనాగరాజు... ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి మధ్యప్రదేశ్​లోని బిలాస్​పూర్ వెళ్లిపోయాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఆయనను.. అక్కడ పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత అతను తన చిరునామా చెప్పటంతో అక్కడి అధికారులు గుంటూరు న్యాయ సేవా అధికారులకు సమాచారం అందించారు.

న్యాయ సేవా అధికారులు... శివనాగరాజు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగరాజు తిరిగి రావటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో అదృశ్యమై మధ్యప్రదేశ్​లో తేలాడు.. ఆరేళ్లకు ఇంటికి చేరాడు!

ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.