ETV Bharat / state

'పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధం'

ఖరీఫ్​ పంట కొనుగోళ్ల నేపథ్యంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్​ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

author img

By

Published : Nov 11, 2019, 10:28 PM IST

'పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధం'

రాష్ట్రంలో ధాన్యంసహా ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో బీఆర్కే భవన్​లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యంపై నిఘా పెట్టాలని మంత్రులు సూచించారు.

రాష్ట్రంలో పండిన పంటలో 25 నుంచి 30 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెసర్లు, సోయాబీన్ పంటల్లో... కనీసం 50 శాతమైనా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని... మార్కెట్లలో తేమ కొలిచే మీటర్లు, కాంటాలు, క్లీనర్లు, టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. 3,327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ... ఇప్పటికే 670 ప్రారంభించిందని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 252 జిన్నింగ్ మిల్లులు, 102 వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన దృష్ట్యా ఇప్పటికే 252 కేంద్రాలు ప్రారంభయ్యాయని ప్రకటించారు.

'పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధం'

ఇవీ చూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో

రాష్ట్రంలో ధాన్యంసహా ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో బీఆర్కే భవన్​లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యంపై నిఘా పెట్టాలని మంత్రులు సూచించారు.

రాష్ట్రంలో పండిన పంటలో 25 నుంచి 30 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెసర్లు, సోయాబీన్ పంటల్లో... కనీసం 50 శాతమైనా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని... మార్కెట్లలో తేమ కొలిచే మీటర్లు, కాంటాలు, క్లీనర్లు, టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. 3,327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ... ఇప్పటికే 670 ప్రారంభించిందని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 252 జిన్నింగ్ మిల్లులు, 102 వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన దృష్ట్యా ఇప్పటికే 252 కేంద్రాలు ప్రారంభయ్యాయని ప్రకటించారు.

'పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధం'

ఇవీ చూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో

11-11-2019 TG_HYD_54_11_MINISTERS_VEDIO_CONFERENCE_ON_PROCUREMENT_AV_3038200 REPORTER : MALLIK.B Note : feed from desk whatsApp ( ) రాష్ట్రంలో ధాన్యంసహా ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో బీఆర్కే భవన్ నుండి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజీవ్ త్రివేది, సౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. చత్తీస్ ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి ధాన్యం అక్రమంగా తెలంగాణ మార్కెట్లకు తరలింపుపై నిఘా పెట్టాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో పండిన పంటలో 25 నుండి 30 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణకు అక్రమంగా ధాన్యం తరలించి మార్కెట్లలో రైతుల పేరిట అమ్ముకుంటున్న దళారులకు కళ్లెం వేయాలని ఆదేశించారు. కర్ణాటక నుండి కందులు, పెసర్లు, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర నుండి కందులు, ధాన్యం, ఏపీ నుండి వేరుశనగ తరలిస్తున్న వైనం ప్రస్తావిస్తూ... మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి మద్ధతు ధరలో ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సారి ఒక్క గింజ కూడా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి దిగుమతి కావొద్దు, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలంపూరు, గద్వాల, నారాయణపేట, భైంసా, తాండూరు, భద్రాచలం, కొత్తగూడెం తదితర సరిహద్దు మార్కెట్లపై నిఘా పెట్టడంతోపాటు చెప్పారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. పెసర్లు, సోయాబీన్ పండిన పంటలో... కనీసం 50 శాతమైనా కొనుగోలు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని... మార్కెట్లలో తేమ కొలిచే మీటర్లు, కాంటాలు, క్లీనర్లు, టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు, ఇతర మౌళిక సదుపాయాలు అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. 3327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ... ఇప్పటికే 670 ప్రారంభించిందని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 252 జిన్నింగ్ మిల్లులు, 102 వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన దృష్ట్యా... ఇప్పటికే... 252 కేంద్రాలు ప్రారంభయ్యాయని ప్రకటించారు. పది చోట్ల హాకా, మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. VIS..........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.