గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం నుంచి కొత్తగా 45 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్లో 22, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానాలు ఈనెల 22న కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ప్రతిరోజు 10 వేల మందికి వైద్యసేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు.
నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయన్నారు. ఒక్కో బస్తీ దవాఖానలో ఒక వైద్యుడు, ఓ నర్స్, ఓ సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని వివరించారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను విస్తృతం చేస్తోందన్నారు.
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు