ఆచార్య జయశంకర్పై స్ఫూర్తి గీతాన్ని హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ ఈ పాటను రచించి గానం చేశారు. ఈ గీతంలో.. ముల్కీ, 1969, మలిదశ తెలంగాణ ఉద్యమాలతో ముడిపడిన జయశంకర్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారు.
మంచి సాహిత్య విలువలున్న పాటను జయశంకర్ స్మృతిలో రాసి పాడిన శ్రీనివాస్ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన ఫొటోలతో చిత్రీకరణ చేశారని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఎన్నో సవాళ్లు... కరోనా పోరాటంలోనే ఏడాది పూర్తి