హైదరాబాద్ పాతబస్తీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు. వారిద్దరూ మైనర్లేనని పోలీసులు చెప్పారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఐదురుగు నిందితులను అరెస్ట్ చేయగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించారు.
మొదట అక్కను ఓ యువకుడు ప్రేమ పేరుతో ప్రలొభ పెట్టాడు. అనంతరం స్కూల్, బస్తీలో ఇతరులకు చెబుతానంటూ బెదిరిస్తూ ఏడాదిగా మరో నలుగురితో కలిసి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తర్వాత 7వ తరగతి చదువుతున్న చెల్లితో ఓ మైనర్ అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం ఇంట్లో చెప్పడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై అత్యాచారం, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్