సికింద్రాబాద్ కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డ్ మెంబర్ భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి... చిన్నకమేల, శ్రీనగర్ కాలనీ, చిన్నమ్మతల్లి బస్తీలకు చెందిన పేద ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు.
సర్కారు లాక్డౌన్ నిబంధనల నుంచి కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ... ప్రతి ఒక్కరూ పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత దూరం పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.