ETV Bharat / state

'అప్పుల బాధతో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం'​

వ్యాపారంలో నష్టం, అప్పుల బాధ...జీవితం పై విరక్తి చెంది సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్ సమీపంలో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు బాధితుడిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Jul 25, 2019, 11:30 PM IST

గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రశాంత్

అప్పుల బాధతో ఓ వ్యక్తి బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్కింగ్​ సమీపంలో చోటు చేసుకుంది. అనంతరం హాహాకారాలు చేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు నెల్లూరుకు చెందిన ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. తాను పని చేస్తోన్న సిమెంట్ ఇటుకల వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యల వల్ల తానే ఆత్యహత్యాయత్నం చేసినట్లు ప్రశాంత్ వెల్లడించాడు.

గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రశాంత్

ఇవీ చూడండి : సీడీఎఫ్​డీ ఉన్నతాధికారిపై తోటి ఉద్యోగి దాడి

అప్పుల బాధతో ఓ వ్యక్తి బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్కింగ్​ సమీపంలో చోటు చేసుకుంది. అనంతరం హాహాకారాలు చేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు నెల్లూరుకు చెందిన ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. తాను పని చేస్తోన్న సిమెంట్ ఇటుకల వ్యాపారంలో నష్టం రావడం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యల వల్ల తానే ఆత్యహత్యాయత్నం చేసినట్లు ప్రశాంత్ వెల్లడించాడు.

గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రశాంత్

ఇవీ చూడండి : సీడీఎఫ్​డీ ఉన్నతాధికారిపై తోటి ఉద్యోగి దాడి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.