ETV Bharat / state

దారి చూపిస్తామంటూ... దారిలోనే వదిలేశారు - Maharashtra Transport problem

లాక్​డౌన్​ వల్ల దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో వేలాది మంది వలస జీవులు తామున్న చోట పనుల్లేక స్వగ్రామాల బాటపట్టారు. తాజాగా ఇలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్​లో మహారాష్ట్ర నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న కార్మికులను కర్ణాటక బసవకల్యాణ్​ వద్దనున్న చందకపురలో వదిలేశారు. చేసేదేమీలేక.. వీరంతా కాలి బాటన స్వగ్రామాలకు బయలుదేరారు.

Maharashtra Transport left telugu migrants on road
దారి చూపిస్తామంటూ... దారిలోనే వదిలేశారు
author img

By

Published : May 17, 2020, 4:43 PM IST

కరోనా కట్టడిలో భాగంగా మార్చిలో ఉన్నపళంగా లాక్‌డౌన్‌ విధించారు. లాక్​డౌన్​ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కార్మికులు ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక ఆందోళన చెందుతున్నారు. సొంతూర్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించమని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను శరణువేడుకుంటున్నారు.

దారి చూపిస్తామంటూ... దారిలోనే వదిలేశారు

సర్కారు సాయంతో..

లాక్​డౌన్​ కారణంగా మహారాష్ట్రలో పనికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు పనుల్లేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తమను ఇంటికి పంపాలని ఆ రాష్ట్ర సర్కారును కోరగా.. ప్రభుత్వం బస్​ ఏర్పాటు చేసింది. సుమారు 200 మందికి పైగా కార్మికులు బస్​లో సొంతూరుకు పయనమయ్యారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు.

ఏవీ దొరకని చోట..

మహారాష్ట్ర రవాణా... కార్మికులను తమ స్వస్థలాలకు తీసుకెళ్లకుండా కర్ణాటక బసవకల్యాణ్​లోని చందకపుర జాతీయ రహదారిపై వీరిని వదిలేసింది. ఊహించని ఘటనకు తెలుగు రాష్ట్రాల కార్మికులు కుదేలయ్యారు. వారిలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని.. కనీసం నీరు, ఆహారం కూడా దొరకని ప్రాంతంలో తమను వదిలేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తమకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

మేం మహారాష్ట్ర నుంచి వస్తున్నాం. లాక్​డౌన్​ వల్ల 50 రోజుల నుంచి మేం ఇబ్బందులు పడుతున్నాము. అక్కడి ప్రభుత్వ సహకారంతో బస్సులో మమ్మల్ని తీసుకొచ్చారు కానీ కర్ణాటక బోర్డర్​ వద్ద వదిలేశారు. ఇక్కడ ఆహారం, నీరు ఏమీ దొరకక పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాకు వెళ్లాలి. అధికారులు స్పందించి మమ్మల్ని మా స్వస్థలాలకు చేర్చండి. - బాధిత వలస కార్మికులు

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

కరోనా కట్టడిలో భాగంగా మార్చిలో ఉన్నపళంగా లాక్‌డౌన్‌ విధించారు. లాక్​డౌన్​ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కార్మికులు ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక ఆందోళన చెందుతున్నారు. సొంతూర్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించమని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను శరణువేడుకుంటున్నారు.

దారి చూపిస్తామంటూ... దారిలోనే వదిలేశారు

సర్కారు సాయంతో..

లాక్​డౌన్​ కారణంగా మహారాష్ట్రలో పనికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు పనుల్లేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తమను ఇంటికి పంపాలని ఆ రాష్ట్ర సర్కారును కోరగా.. ప్రభుత్వం బస్​ ఏర్పాటు చేసింది. సుమారు 200 మందికి పైగా కార్మికులు బస్​లో సొంతూరుకు పయనమయ్యారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు.

ఏవీ దొరకని చోట..

మహారాష్ట్ర రవాణా... కార్మికులను తమ స్వస్థలాలకు తీసుకెళ్లకుండా కర్ణాటక బసవకల్యాణ్​లోని చందకపుర జాతీయ రహదారిపై వీరిని వదిలేసింది. ఊహించని ఘటనకు తెలుగు రాష్ట్రాల కార్మికులు కుదేలయ్యారు. వారిలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని.. కనీసం నీరు, ఆహారం కూడా దొరకని ప్రాంతంలో తమను వదిలేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తమకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

మేం మహారాష్ట్ర నుంచి వస్తున్నాం. లాక్​డౌన్​ వల్ల 50 రోజుల నుంచి మేం ఇబ్బందులు పడుతున్నాము. అక్కడి ప్రభుత్వ సహకారంతో బస్సులో మమ్మల్ని తీసుకొచ్చారు కానీ కర్ణాటక బోర్డర్​ వద్ద వదిలేశారు. ఇక్కడ ఆహారం, నీరు ఏమీ దొరకక పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాకు వెళ్లాలి. అధికారులు స్పందించి మమ్మల్ని మా స్వస్థలాలకు చేర్చండి. - బాధిత వలస కార్మికులు

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.