ETV Bharat / state

లాక్​డౌన్​లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు బంద్​ - lock down effect on registration department

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి లాక్​డౌన్​ అమలైంది. కొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ మంత్రి మండలి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల​ శాఖకు సంబంధించి కార్యాలయాల పనివేళలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పది రోజుల పాటు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆ శాఖ కమిషనర్​ ఆదేశాలు జారీ చేశారు.

lock down effect on stamps and registration department
స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖపై లాక్​డౌన్​ ప్రభావం
author img

By

Published : May 12, 2021, 11:14 AM IST

Updated : May 12, 2021, 11:37 AM IST

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్రంగా పడింది. కరోనా కేసులు పెరగడం, మృతుల సంఖ్య అధికం కావడంతో ఇప్పటికే రోజువారీ రిజిస్ట్రేషన్లు సగానికి పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖలోను కరోనా కేసుల తీవ్రతతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి లాక్​డౌన్ అమల్లోకి రావడంతో.. కార్యకలాపాలు ఆపేయాలని ఆ శాఖ కమిషనర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులు రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరైనా ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని ఉంటే.. తిరిగి మరో తేదీకి రీషెడ్యూల్‌ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రావద్దని సూచించారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అయినప్పటికీ క్రయవిక్రయాలన్నీ కూడా ప్రజలతో ముడిపడి ఉంటాయి. లాక్ డౌన్ కారణంగా రాకపోకలు ఉండనందున… ప్రభుత్వం కూడా మూసివేతకే మొగ్గు చూపింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి 10రోజులు లాక్‌డౌన్‌

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్రంగా పడింది. కరోనా కేసులు పెరగడం, మృతుల సంఖ్య అధికం కావడంతో ఇప్పటికే రోజువారీ రిజిస్ట్రేషన్లు సగానికి పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖలోను కరోనా కేసుల తీవ్రతతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి లాక్​డౌన్ అమల్లోకి రావడంతో.. కార్యకలాపాలు ఆపేయాలని ఆ శాఖ కమిషనర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులు రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరైనా ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని ఉంటే.. తిరిగి మరో తేదీకి రీషెడ్యూల్‌ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రావద్దని సూచించారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అయినప్పటికీ క్రయవిక్రయాలన్నీ కూడా ప్రజలతో ముడిపడి ఉంటాయి. లాక్ డౌన్ కారణంగా రాకపోకలు ఉండనందున… ప్రభుత్వం కూడా మూసివేతకే మొగ్గు చూపింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి 10రోజులు లాక్‌డౌన్‌

Last Updated : May 12, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.