కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. శనివారం కూకట్పల్లిలో డివిజన్ అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంగా కలుసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయనే.. టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో పాటు... జీహెచ్ఎంసీ అధికారులు, జలమండలి అధికారులు కూడా పాల్గొన్నారు.
సమస్యలపై ఎమ్మెల్యేకు వివరణ
అసోసియేషన్ సభ్యులు వారికి ఉన్న సమస్యలను... ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలలో కూడా వైరస్ విపరీతంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుని శానిటేషన్ చేపట్టాలని కోరారు. అలాగే చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్, పార్కు, నీటి సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
పరిష్కరిస్తామని హామీ
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే సూచనలు
కాలనీలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. వీలైనంత వరకు బయటకు వెళ్లడం తగ్గిస్తే మంచిదని వివరించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పవచ్చని... అసోసియేషన్ సభ్యులకు చెప్పారు. వైరస్కు మందు లేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీశ్అరోరా, జీహెచ్ఎంసీ అధికారులు, అసోసియేషన్ సభ్యులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు.