ETV Bharat / state

వికలాంగులకు కూకట్​పల్లి ఎమ్మెల్యే చేయూత

లాక్​డౌన్​తో ఉపాధి లేక పేదలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

author img

By

Published : May 14, 2020, 3:18 PM IST

kukatpally mla madhavaram krishna rao distributed groceries to handicapped
వికలాంగులకు కూకట్​పల్లి ఎమ్మెల్యే చేయూత

హైదరాబాద్​ అల్లాపూర్​ డివిజన్ మోతీనగర్​లో ఉపాధి లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. వారికి చేయూతనిచ్చేందుకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

కరోనా బారిన పడకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్​డౌన్​ ముగిసే వరకు వికలాంగులు, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్​ అల్లాపూర్​ డివిజన్ మోతీనగర్​లో ఉపాధి లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. వారికి చేయూతనిచ్చేందుకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

కరోనా బారిన పడకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్​డౌన్​ ముగిసే వరకు వికలాంగులు, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.