హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ మోతీనగర్లో ఉపాధి లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. వారికి చేయూతనిచ్చేందుకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
కరోనా బారిన పడకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్డౌన్ ముగిసే వరకు వికలాంగులు, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.