ETV Bharat / state

ఇన్​స్టాషీల్డ్​.. కరోనాను అరికట్టేందుకు గ్రామీణ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం - insta shield virus killer device

Insta Shield Medical Device: కరోనా వేరియంట్లను అరికట్టేందుకు గ్రామీణ శాస్త్రవేత్త రూపొందించిన ఇన్​స్టాషీల్డ్​ వైరస్ కిల్లర్​ పరికరాన్ని మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. తక్కువ సమయంలోనే ఈ పరికరం అన్ని రకాల వైరస్​లను సంహరిస్తుందని శాస్త్రవేత్త తెలిపారు. సీసీఎంబీ సైతం దీనిని ధ్రువీకరించిందని వెల్లడించారు. సైంటిస్టు కృషి పట్ల కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలకు ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.

Insta Shield Medical Device
ఇన్​స్టాషీల్డ్​
author img

By

Published : Apr 23, 2022, 3:05 PM IST

Insta Shield Medical Device: నిజామాబాద్​ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన 'ఇన్​స్టాషీల్డ్ వైరస్ కిల్లర్'(Insta shield Virus Killer) పరికరాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్​.. హైదరాబాద్​లోని తన నివాసంలో ఆవిష్కరించారు. పరికరం రూపకల్పన, పనితీరును నర్సింహాచారిని అడిగి తెలుసుకున్న మంత్రి.. ఆయనను అభినందించారు. ఆవిష్కరణ అద్భుతమని.. ఈ పరికరం అందరికీ ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరికరం ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమ ఏర్పాటుకోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నర్సింహాచారి 'ఇంటింటా ఇన్నోవేటర్' పురస్కారానికి ఎంపికయ్యారని.. ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని మంత్రి కొనియాడారు.

ప్రజలను వైరస్​ల బారి నుంచి కాపాడేందుకు.. రెండేళ్లు శ్రమించి ఇన్​స్టాషీల్డ్​ పరికరాన్ని రూపొందించానని నర్సింహాచారి తెలిపారు. కరోనా, సార్స్, ఒమిక్రాన్, డెల్టా తదితర అన్ని రకాల వైరస్​లను.. నెగిటివ్​ ఎలక్ట్రాన్ల సహాయంతో ఈ పరికరం సంహరిస్తుందన్నారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీనిని ధ్రువీకరించాయని.. ఇన్​స్టాషీల్డ్ మెడికల్ డివైస్ పేరిట విడుదల చేస్తున్నారని చారి వివరించారు.

అత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్​లను సంహరిస్తుందని చారి తెలిపారు. ఈ పరికరం వల్ల దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని వివరణ ఇచ్చారు. ఈ గ్రామీణ శాస్త్రవేత్త ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీప బుద్వేల్​లో నివసిస్తున్నారు. కరోనా మూలాల్ని తెలుసుకుని, పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారు చేశారు.

Insta Shield Medical Device: నిజామాబాద్​ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన 'ఇన్​స్టాషీల్డ్ వైరస్ కిల్లర్'(Insta shield Virus Killer) పరికరాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్​.. హైదరాబాద్​లోని తన నివాసంలో ఆవిష్కరించారు. పరికరం రూపకల్పన, పనితీరును నర్సింహాచారిని అడిగి తెలుసుకున్న మంత్రి.. ఆయనను అభినందించారు. ఆవిష్కరణ అద్భుతమని.. ఈ పరికరం అందరికీ ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరికరం ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమ ఏర్పాటుకోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నర్సింహాచారి 'ఇంటింటా ఇన్నోవేటర్' పురస్కారానికి ఎంపికయ్యారని.. ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని మంత్రి కొనియాడారు.

ప్రజలను వైరస్​ల బారి నుంచి కాపాడేందుకు.. రెండేళ్లు శ్రమించి ఇన్​స్టాషీల్డ్​ పరికరాన్ని రూపొందించానని నర్సింహాచారి తెలిపారు. కరోనా, సార్స్, ఒమిక్రాన్, డెల్టా తదితర అన్ని రకాల వైరస్​లను.. నెగిటివ్​ ఎలక్ట్రాన్ల సహాయంతో ఈ పరికరం సంహరిస్తుందన్నారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీనిని ధ్రువీకరించాయని.. ఇన్​స్టాషీల్డ్ మెడికల్ డివైస్ పేరిట విడుదల చేస్తున్నారని చారి వివరించారు.

అత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్​లను సంహరిస్తుందని చారి తెలిపారు. ఈ పరికరం వల్ల దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని వివరణ ఇచ్చారు. ఈ గ్రామీణ శాస్త్రవేత్త ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీప బుద్వేల్​లో నివసిస్తున్నారు. కరోనా మూలాల్ని తెలుసుకుని, పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారు చేశారు.

ఇవీ చదవండి: MLC Kavitha On Cancer Awareness: అది ఒక అలవాటుగా చేసుకుందాం: కవిత

టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.