ETV Bharat / state

24న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ! - TRS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​లు ఈనెల 24న  సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

beti
author img

By

Published : Sep 19, 2019, 11:16 PM IST

.

.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.