ETV Bharat / state

కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు

author img

By

Published : Nov 11, 2019, 5:07 AM IST

Updated : Nov 11, 2019, 8:04 AM IST

సాగు, తాగునీటితో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్ హైదరాబాద్​లో ఇవాళ ..దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులతో సదస్సు నిర్వహించనున్నారు.

కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు

భాగ్యనగరంలో నేడు నీటి పారుదలతో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరగనున్న సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్ పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు.

సీఎం దిశానిర్దేశంతో..

తమిళనాడులో తాగునీటి సమస్యపై, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. సదస్సు నేపథ్యంలో సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్సీ మరళీధర్​తో సమావేశమైన సీఎం కేసీఆర్.. రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండిః జలశక్తి అభియాన్​లో మహబూబ్​నగర్​దే​ మొదటి స్థానం

భాగ్యనగరంలో నేడు నీటి పారుదలతో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరగనున్న సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్ పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు.

సీఎం దిశానిర్దేశంతో..

తమిళనాడులో తాగునీటి సమస్యపై, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. సదస్సు నేపథ్యంలో సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్సీ మరళీధర్​తో సమావేశమైన సీఎం కేసీఆర్.. రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండిః జలశక్తి అభియాన్​లో మహబూబ్​నగర్​దే​ మొదటి స్థానం

TG_Hyd_03_11_Jalashakthi_meeting_Dry_3053262 From : Raghu vardhan ( ) సాగునీరుతో పాటు తాగునీరు, పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ హైదరాబాద్ ల్లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సదస్సులో కేంద్ర జలశక్తిశాఖా మంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొననున్నారు. నీటిపారుదల అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రస్తావనకు రానుంది. తమిళనాడులో తాగునీటి సమస్యపై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై కూడా సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది. తాగునీటి అవసరాలు, పారిశుధ్య సంబంధిత అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు. సదస్సు నేపథ్యంలో సీఎస్ జోషి, నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ తో శనివారం సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు.
Last Updated : Nov 11, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.