హైదరాబాద్లో లాక్డౌన్ లెక్కచేయకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వాహనాలను కొత్తపేట చౌరస్తాలో సరూర్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
5 కార్లు, 8 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మాదన్నపేట ప్రధాన రహదారిపై ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. యువకులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి : కరోనా అవగాహన కోసం.. ప్రచార రథం సిద్ధం చేసిన సిద్దిపేట పోలీసులు