ETV Bharat / state

జరభద్రం: ఇప్పటి వరకు కేసులే.. ఇకనుంచి వాహనాలు సీజ్​

author img

By

Published : May 20, 2021, 9:10 PM IST

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించినా... ప్రజల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. లాక్​డౌన్​ సమయంలో బయటకు రావొద్దని పలుమార్లు పోలీసులు హెచ్చరించినా రోడ్లపై సంచరిస్తూనే ఉన్నారు. హైదరాబాద్​ నగరంలో ఇప్పటి వరకు కేసులతో సరిపెట్టిన పోలీసులు.. ఇక నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

lock in hyderabad
హైదరాబాద్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​

కరోనా కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా... కొందరు వాహనదారులు ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కేవలం కేసులతో సరిపెట్టిన పోలీసులు ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్​ షాపూర్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

బాలానగర్ జోన్​లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈనెల 12 నుంచి 20 వరకు సుమారు 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తామని, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం

కరోనా కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా... కొందరు వాహనదారులు ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కేవలం కేసులతో సరిపెట్టిన పోలీసులు ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్​ షాపూర్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

బాలానగర్ జోన్​లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈనెల 12 నుంచి 20 వరకు సుమారు 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తామని, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.