ETV Bharat / state

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి' - hyderabad cpm fire on labour deportment

రాష్ట్రంలో పలు నిర్మాణ సంస్థలు సెస్​ ఎగవేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సీపీఎం హైదరాబాద్ నగర శాఖ ఆరోపించింది. 162 కోట్ల రూపాయల సెస్​ ఎగ్గొట్టిన ఎల్​ అండ్​ టీపై చర్యుల తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'
'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Jan 28, 2020, 6:05 PM IST

రాష్ట్రంలో నిర్మాణ సంస్థల లేబర్ సెస్ ఎగవేతపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని సీపీఎం భాగ్యనగర కమిటీ డిమాండ్ చేసింది. రూ.162 కోట్లు ఎగ్గొట్టిన ఎల్​ అండ్​ టీపై చర్యలు తీసుకోవాలని కోరింది. కార్మికుల సంక్షేమానికి నిర్మాణంపై ఒక శాతం పన్ను వసూలు చేయాలని చట్టం ఉన్నప్పటికీ... కార్మికశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

గతేడాది 16వేల నిర్మాణాలకు అనుమతులివ్వగా... కేవలం 39 సంస్థలు, 2018లో 14 వేలకు గానూ... 38 సంస్థలు సెస్ చెల్లించాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్​ నిర్మాణం చేపట్టిన ఎల్​ అండ్​ టీ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 నాటికి కార్మిక సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన రూ.600 కోట్లు తీసుకురావడంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'

ఇదీ చూడండి: ఏపీ శాసన మండలి రద్దు అంశంపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో నిర్మాణ సంస్థల లేబర్ సెస్ ఎగవేతపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని సీపీఎం భాగ్యనగర కమిటీ డిమాండ్ చేసింది. రూ.162 కోట్లు ఎగ్గొట్టిన ఎల్​ అండ్​ టీపై చర్యలు తీసుకోవాలని కోరింది. కార్మికుల సంక్షేమానికి నిర్మాణంపై ఒక శాతం పన్ను వసూలు చేయాలని చట్టం ఉన్నప్పటికీ... కార్మికశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

గతేడాది 16వేల నిర్మాణాలకు అనుమతులివ్వగా... కేవలం 39 సంస్థలు, 2018లో 14 వేలకు గానూ... 38 సంస్థలు సెస్ చెల్లించాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్​ నిర్మాణం చేపట్టిన ఎల్​ అండ్​ టీ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 నాటికి కార్మిక సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన రూ.600 కోట్లు తీసుకురావడంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'

ఇదీ చూడండి: ఏపీ శాసన మండలి రద్దు అంశంపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు

Intro:కార్మిక శాఖ కార్మిక పన్ను వసూలు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై సిపిఎం మండిపడింది


Body:రాష్ట్రంలో నిర్మాణ సంస్థలు వేలకోట్ల లేబర్ సెస్ ఎగవేత పై విచారణ జరిపించాలని, 162 కోట్ల సెస్ ఎగవేసిన ఎల్ అండ్ టి, మెట్రో రైల్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది..... కార్మికుల సంక్షేమానికి ప్రతి నిర్మాణంపై ఒక శాతం పన్ను వసూలు చేయాలని చట్టం ఉన్నప్పటికీ కార్మిక శాఖ పట్టనట్లు వ్యవహరిస్తోందని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు జిహెచ్ఎంసి పరిధిలో గత ఏడాది 16000 గా నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు...నిర్మాణాలు చేపట్టిన సంస్థల్లో కేవలం 39 సంవత్సరాలు మాత్రమే కార్మిక శాఖకు సెస్ చెల్లించాయని,, 2018లో 14 వేల నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా వాటిలో 38 సంవత్సరాలు మాత్రమే పన్ను చెల్లించినట్లు ఆయన తెలిపారు... మిగతా సంస్థలు కార్మిక శాఖకు ఎలాంటి పన్ను చెల్లించలేదని,, ఆయా సంస్థల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు... హైదరాబాద్ మెట్రో రైల్ కాంట్రాక్టర్ ఎల్ అండ్ టి సంస్థ 162 కోట్ల లేబర్ సెస్ ఎగ వేసిందని ఆయన చెప్పారు... లేబర్ సెస్ ఎగవేసిన ఎల్ అండ్ టి సంస్థ కోర్టు నుండి స్టే తీసుకువచ్చి దానిపై కార్మిక శాఖ ఇలాంటి కౌంటర్ వేయలేదని ఆయన తెలిపారు కోటి నుండి తీసుకువచ్చిన కాలపరిమితి ఆరు నెలలకు మించి ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొం దని ఆయన వివరించారు.... ఐదేళ్ల అవుతున్న ఎల్ఎన్టి సంస్థపై కార్మికశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కార్మిక శాఖ సెస్ ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపో ఇవ్వడానికి గల కారణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్మిక శాఖ వసూలు చేసిన లేబర్ సెస్ కు సంబంధించిన కోట్ల రూపాయలను కార్మికుల సంక్షేమానికి వినియోగించకుండా murgi పోతున్నాయని ఆయన తెలిపారు ఆయా నిధులను కార్మికుల సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేయాలని ఆయన కోరారు...2014 నాటికి వెల్ఫేర్ బోర్డు లో ఉన్న 1,400 కోట్ల లో 600 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉండగా నేటికీ ఆ నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికశాఖ సెస్ విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.....

బైట్...... ఎం శ్రీనివాస్ సిపిఎం నగర కార్యదర్శి


Conclusion:లేబర్ సెస్ విషయంలో కార్మిక శాఖ అనుసరిస్తున్న వైఖరిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.