ETV Bharat / state

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు తెలుగోళ్లు మృతి - అమెరికాలో హైదరాబాద్​ దంపతుల మృతి

road accident in US
రాజా, దివ్య
author img

By

Published : Feb 25, 2020, 4:25 PM IST

Updated : Feb 25, 2020, 6:24 PM IST

16:24 February 25

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు తెలుగోళ్లు మృతి

అమెరికాలో హైదరాబాద్​ దంపతుల మృతి

హైదరాబాద్​ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడే ఓ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ ఇంటి చూసేందుకు బయలుదేరిన దంపతులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారితో కలిసి వెళుతున్న స్నేహితుడూ మరణించాడు. అమెరికాలోని డల్లాస్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  

అమెరికాలోని డల్లాస్​లో ఓ కారు వేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్​కు చెందిన రాజా, దివ్య దంపతులు అమెరికాలో స్థిర పడ్డారు. అక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా ఏడేళ్ల కూతురు ఉంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో సొంతింటి కల అలానే మిగిలిపోయిందనే బాధ ఉండేది. అందుకే ఇటీవలే ఓ ఇంటిని నిర్మించుకుంటున్నారు.  

కొత్త ఇంటిని చూసేందుకు దంపతులిద్దరూ బయలుదేరారు. రాజా మిత్రుడు ప్రేమ్​నాథ్​ను సైతం తీసుకెళ్లారు. వాళ్ల గారాల పట్టి రియాను డాన్స్ స్కూల్​లో దింపేశారు. మళ్లీ వస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ఎదురుగా ఓ మైనర్​ బాలుడు వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.  

దంపతులిద్దరిదీ హైదరాబాద్​లోని గాంధీనగర్​. ప్రేమ్​నాథ్​ది ఆంధ్రప్రదేశ్. రాజా బుధువు రాఘవరావు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒకేసారి అమ్మానాన్న చనిపోవడం వల్ల ఏడేళ్ల చిన్నారి అనాథగా మారింది.  

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

16:24 February 25

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు తెలుగోళ్లు మృతి

అమెరికాలో హైదరాబాద్​ దంపతుల మృతి

హైదరాబాద్​ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడే ఓ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ ఇంటి చూసేందుకు బయలుదేరిన దంపతులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారితో కలిసి వెళుతున్న స్నేహితుడూ మరణించాడు. అమెరికాలోని డల్లాస్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.  

అమెరికాలోని డల్లాస్​లో ఓ కారు వేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్​కు చెందిన రాజా, దివ్య దంపతులు అమెరికాలో స్థిర పడ్డారు. అక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా ఏడేళ్ల కూతురు ఉంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో సొంతింటి కల అలానే మిగిలిపోయిందనే బాధ ఉండేది. అందుకే ఇటీవలే ఓ ఇంటిని నిర్మించుకుంటున్నారు.  

కొత్త ఇంటిని చూసేందుకు దంపతులిద్దరూ బయలుదేరారు. రాజా మిత్రుడు ప్రేమ్​నాథ్​ను సైతం తీసుకెళ్లారు. వాళ్ల గారాల పట్టి రియాను డాన్స్ స్కూల్​లో దింపేశారు. మళ్లీ వస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ఎదురుగా ఓ మైనర్​ బాలుడు వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.  

దంపతులిద్దరిదీ హైదరాబాద్​లోని గాంధీనగర్​. ప్రేమ్​నాథ్​ది ఆంధ్రప్రదేశ్. రాజా బుధువు రాఘవరావు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒకేసారి అమ్మానాన్న చనిపోవడం వల్ల ఏడేళ్ల చిన్నారి అనాథగా మారింది.  

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

Last Updated : Feb 25, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.