రోజులు గడుస్తున్నా నేటికి కమిటీ విధి విధానాలు రూపొందించలేదు. ఏప్రిల్ 1 దగ్గర పడుతుండటంతో అత్యవసరంగా ఆర్టీఎ అధికారులు, ఎంవీఐలు, పరిపాలన అధికారులతో ఖైరతాబాద్లోని కేంద్ర రవాణాశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో డీలర్ల సాప్ట్వేర్కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఆర్టీఎ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడే దీన్ని అమలుచేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని గుర్తించారు.
తొలివిడతలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ పరిశీలించాలని యోచిస్తున్నారు. అది సత్ఫలితాలు ఇస్తే వెంటనే ఆటోలు, కార్లకు కూడా అనుమతివ్వనున్నారు. ప్రభుత్వ వాహనాలకు వీటి నుంచి మినహాయింపు వుంది. ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకున్నవారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ వేలం పాట ద్వారా పొందవచ్చు. ఈ నిబంధన అమల్లోకి వస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఎ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుల నుంచి షోరూమ్ డీలర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ షో రూమ్ ద్వారానే జరిగితే అవినీతి మరింత పెరిగే ప్రమాదం ఉందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై రవాణాశాఖ అధికారుల నిఘా ఉండాలని కోరుతున్నారు.
మొత్తంమీద సాధ్యసాధ్యాల పరిశీలన, సాఫ్ట్వేర్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే.. షోరూమ్ రిజిస్ట్రేషన్తో ఇబ్బందులు తప్పకపోవచ్చనిపిస్తోంది.