ETV Bharat / state

కాంగ్రెస్​ పార్టీ ధర్నాకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​.. కానీ?

author img

By

Published : Jan 4, 2023, 5:06 PM IST

High Court permission for Congress party to Dharna: గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై కాంగ్రెస్​ పార్టీ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాచౌక్​ వద్ద ధర్నాకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. కానీ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.

High Court
తెలంగాణ హైకోర్టు

High Court permission for Congress party to Dharna: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ.. గ్రామ పంచాయతీ నిధుల గురించి ధర్నాచౌక్​ వద్ద నిర్వహించనున్న ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి వేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని టీపీసీసీ సవాల్​ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై లంచ్​ మోషన్​లో విచారణను స్వీకరించిన ధర్మాసనం.. తీర్పును వెలువరించింది.

గ్రామ పంచాయతీలకు నిధులపై తలపెట్టిన ధర్నాకు అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ధర్నాచౌక్​ వద్ద ధర్నాకు సంబంధించిన కొత్త తేదీలతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీకి తెలిపింది. ఈ ధర్నాలో పాల్గొనే వారు 300 మందికి మించి ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగింది: ఈనెల 2వ తేదీన గ్రామ పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధర్నాచౌక్​ వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని అరెస్టు చేసి.. బొల్లారం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ధర్నాచౌక్​ వద్ద ధర్నాలు చేయడానికి కాంగ్రెస్​ పార్టీకి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. హైకోర్టు పచ్చజెండా ఊపింది.

ఇవీ చదవండి:

High Court permission for Congress party to Dharna: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ.. గ్రామ పంచాయతీ నిధుల గురించి ధర్నాచౌక్​ వద్ద నిర్వహించనున్న ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి వేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని టీపీసీసీ సవాల్​ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై లంచ్​ మోషన్​లో విచారణను స్వీకరించిన ధర్మాసనం.. తీర్పును వెలువరించింది.

గ్రామ పంచాయతీలకు నిధులపై తలపెట్టిన ధర్నాకు అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ధర్నాచౌక్​ వద్ద ధర్నాకు సంబంధించిన కొత్త తేదీలతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీకి తెలిపింది. ఈ ధర్నాలో పాల్గొనే వారు 300 మందికి మించి ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగింది: ఈనెల 2వ తేదీన గ్రామ పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధర్నాచౌక్​ వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని అరెస్టు చేసి.. బొల్లారం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ధర్నాచౌక్​ వద్ద ధర్నాలు చేయడానికి కాంగ్రెస్​ పార్టీకి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై టీపీసీసీ ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. హైకోర్టు పచ్చజెండా ఊపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.