కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద జనం బారులు తీరారు. ఈ నెల 12 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోకుండానే వ్యాక్సిన్ ఇస్తుండడం వల్ల అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఫలితంగా కోఠి ఈసామియా బజార్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రద్దీ నెలకొంది.
ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. జనం పోటెత్తడం వల్ల పోలీసులు వచ్చి కరోనా నిబంధనలు అమలు పరుస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి