ETV Bharat / state

జోరు వానలో తడిసి ముద్దైన భాగ్యనగరం

author img

By

Published : May 16, 2020, 9:30 PM IST

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం నీటితో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈదురుగాలుల వల్ల పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​ నిలిచిపోయింది.

heavy rain fall recorded in hyderabad
జోరు వానలో తడిసి ముద్దైన భాగ్యనగరం

క్యుములోనింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరుణుడి ప్రతాపానికి నగరంలో రోడ్లు కాలువలను తలపించాయి. ప్రధాన రహదారులపై వరదనీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేసీపీ జంక్షన్, మోడల్ హౌజ్, లక్డీకాపూల్, కోఠి ప్రధాన రహదారులపై మోకాలు లోతు వర్షపు నీరు చేరింది.

నగరంలో వరుణుడి ప్రతాపం

నగరంలో చాలా చోట్ల 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అమీర్​పేట్ మైత్రీవనంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా... బంజారాహిల్స్​లో 4.5... యూసూఫ్ గూడ కృష్ణానగర్​లో, మోతినగర్​లో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్​లో 3.7, బాలానగర్​లో 2.7, టోలీచౌక్​లో 2.5, జూబ్లీహిల్స్​లో 2.4 సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాయదుర్గంలో 2.2, బేగంపేట్​లో 2.1, శ్రీనగర్ కాలనీలో 1.8, అసిఫ్ నగర్​లో 1.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

నేలకొరిగిన చెట్లు... పొంగి పొర్లిన డ్రైనేజీలు

నగరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు వాహనాలపై పడి అద్దాలు దెబ్బతిన్నాయి. బంజారాహిల్స్​లోని రోడ్డు నంబర్ 10లో రహదారిపై చెట్టు కూలిపోయింది. సింగాలిబస్తీలో ఓ ఇంటిపై పక్కింటి గోడ కూలిపడింది. అఘాపూరలో చెట్టు కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యూసుఫ్ గూడ ప్రేమ్ నగర్ బస్తీలోని లోతట్ట ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. శ్రీకృష్ణ నగర్​లో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లి.... రహదార్లను మురుగు నీరు ముంచెత్తింది. జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్లను తొలిగిస్తున్నారు. వరద నీటిని తరలించడానికి చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ

క్యుములోనింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరుణుడి ప్రతాపానికి నగరంలో రోడ్లు కాలువలను తలపించాయి. ప్రధాన రహదారులపై వరదనీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేసీపీ జంక్షన్, మోడల్ హౌజ్, లక్డీకాపూల్, కోఠి ప్రధాన రహదారులపై మోకాలు లోతు వర్షపు నీరు చేరింది.

నగరంలో వరుణుడి ప్రతాపం

నగరంలో చాలా చోట్ల 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అమీర్​పేట్ మైత్రీవనంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా... బంజారాహిల్స్​లో 4.5... యూసూఫ్ గూడ కృష్ణానగర్​లో, మోతినగర్​లో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్​లో 3.7, బాలానగర్​లో 2.7, టోలీచౌక్​లో 2.5, జూబ్లీహిల్స్​లో 2.4 సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాయదుర్గంలో 2.2, బేగంపేట్​లో 2.1, శ్రీనగర్ కాలనీలో 1.8, అసిఫ్ నగర్​లో 1.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

నేలకొరిగిన చెట్లు... పొంగి పొర్లిన డ్రైనేజీలు

నగరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు వాహనాలపై పడి అద్దాలు దెబ్బతిన్నాయి. బంజారాహిల్స్​లోని రోడ్డు నంబర్ 10లో రహదారిపై చెట్టు కూలిపోయింది. సింగాలిబస్తీలో ఓ ఇంటిపై పక్కింటి గోడ కూలిపడింది. అఘాపూరలో చెట్టు కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యూసుఫ్ గూడ ప్రేమ్ నగర్ బస్తీలోని లోతట్ట ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. శ్రీకృష్ణ నగర్​లో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లి.... రహదార్లను మురుగు నీరు ముంచెత్తింది. జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్లను తొలిగిస్తున్నారు. వరద నీటిని తరలించడానికి చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.