ETV Bharat / state

గ్రూప్​-1 సవరణలకు మరో అవకాశం.. 24 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - టీఎస్​పీఎస్సీ

Group1 Edit Option Extend: గ్రూప్‌-1 దరఖాస్తుల సవరణలకు టీఎస్​పీఎస్సీ మరోసారి గడువు పొడిగించింది. ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశమిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన గడువు నేటితో ముగియగా తాజాగా పెంచింది.

Group1 Edit Option Extend
గ్రూప్​-1 సవరణలకు మరో అవకాశం
author img

By

Published : Jul 21, 2022, 8:16 PM IST

Group1 Edit Option Extend: గ్రూప్-1 దరఖాస్తుల సవరణల గడువును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో వారం పొడిగించింది. ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి నేటి వరకు ఇచ్చిన గడువును మరోసారి పెంచింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం సుమారు 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే కొన్ని పొరపాట్లు చేశామని.. ఎడిట్ చేసే అవకాశం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరారు. దీంతో టీఎస్పీఎస్సీ మరోసారి సవరణలకు అవకాశం కల్పించింది. దరఖాస్తులో మార్పులు చేసుకునే వివరాలకు ఆధారంగా తగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది. వర్షాలు, వరదల వల్ల ధ్రువపత్రాలు పొందలేకపోయామని.. మరింత సమయం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరడంతో గడువు పెంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్​లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐపీఎంలో 24 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

Group1 Edit Option Extend: గ్రూప్-1 దరఖాస్తుల సవరణల గడువును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో వారం పొడిగించింది. ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి నేటి వరకు ఇచ్చిన గడువును మరోసారి పెంచింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం సుమారు 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే కొన్ని పొరపాట్లు చేశామని.. ఎడిట్ చేసే అవకాశం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరారు. దీంతో టీఎస్పీఎస్సీ మరోసారి సవరణలకు అవకాశం కల్పించింది. దరఖాస్తులో మార్పులు చేసుకునే వివరాలకు ఆధారంగా తగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది. వర్షాలు, వరదల వల్ల ధ్రువపత్రాలు పొందలేకపోయామని.. మరింత సమయం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరడంతో గడువు పెంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్​లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐపీఎంలో 24 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

ఇవీ చదవండి: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు

CCTV Video: పెట్రోల్​ బంక్​లోకి దూసుకొచ్చిన బస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.