ETV Bharat / state

'తన్నీరు శ్రీరంగరావు, బాలరాజు గౌడ్​​కు ఘనంగా సన్మానం'

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్​గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావు, ఏపీ ప్రభుత్వ ప్లీడర్​గా నియామకమైన బాలరాజు గౌడ్​ను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్​ నాంపల్లిలో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Nov 2, 2019, 6:09 AM IST

మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మానం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్​గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావును తోటి న్యాయవాదులు హైదరాబాద్​లో ఘనంగా సన్మానించారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన న్యాయవాది బాలరాజును ఏపీ ప్రభుత్వ ప్లీడర్​గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్​కు కృతజ్ఞతలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు... బాలరాజు గౌడ్​​ను సన్మానించారు.
శ్రీరంగరావు కుటుంబం ఉద్యమాల చరిత్ర గలదని...అలాగే శ్రీరంగరావు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగరావును టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్ గా నియమించి సముచితమైన స్థానం కల్పించారన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని శ్రీరంగరావును తోటి న్యాయవాదులు కోరారు.

మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మానం
ఇవీ చూడండి : ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్​గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావును తోటి న్యాయవాదులు హైదరాబాద్​లో ఘనంగా సన్మానించారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన న్యాయవాది బాలరాజును ఏపీ ప్రభుత్వ ప్లీడర్​గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్​కు కృతజ్ఞతలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు... బాలరాజు గౌడ్​​ను సన్మానించారు.
శ్రీరంగరావు కుటుంబం ఉద్యమాల చరిత్ర గలదని...అలాగే శ్రీరంగరావు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగరావును టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్ గా నియమించి సముచితమైన స్థానం కల్పించారన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని శ్రీరంగరావును తోటి న్యాయవాదులు కోరారు.

మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మానం
ఇవీ చూడండి : ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.