ETV Bharat / state

ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్

author img

By

Published : Mar 6, 2020, 1:20 PM IST

Updated : Mar 7, 2020, 5:41 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తమిళిసై తొలిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని తమిళిసై అన్నారు. తక్కువ కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని ప్రశంసించారు. గవర్నర్​ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

governor-tamilsais-speech-was-headlines-in-assembly
గవర్నర్​ తమిళిసై ప్రసంగం ముఖ్యాంశాలు...
గవర్నర్​ తమిళిసై ప్రసంగం ముఖ్యాంశాలు...

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

పింఛన్లు

  1. కేవలం తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు.
  2. ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే.
  3. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు.
  4. తెలంగాణ ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుంది.
  5. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  6. ఫలితంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా ఫించన్లు అందనున్నాయి.

విద్యార్థులు, యువత

  1. విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోంది.
  2. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది.
  3. యువత ఉపాధి కోసం నడుపుకునే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.

సంక్షేమ రంగం

  1. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.
  2. హోంగార్డులకు దేశంలో ఎక్కడాలేనంత వేతనం తెలంగాణలోనే అందుతుంది.
  3. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్స్ అందిస్తోంది.
  4. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోంది.
  5. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబరు వన్‌గా నిలబడింది.

విద్యుత్​ రంగం

  1. విద్యుత్ రంగంలో తెలంగాణ అనితర సాధ్యమైన విజయాలు సాధించింది.
  2. ఉమ్మడి ఏపీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు.
  3. తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు వచ్చింది.
  4. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నాం.
  5. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
  6. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
  7. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది

వ్యవసాయం

  1. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం.
  2. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌తో చర్యలు.
  3. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.
  4. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు

నీటిపారుదల రంగం

  1. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సమగ్ర జలవిధానం అమలు.
  2. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం.
  3. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది.
  4. ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది.
  5. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి.
  6. 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం మంజూరు చేసింది.
  7. త్వరలోనే సీతమ్మ బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయి.
  8. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు.
  9. ఈ యాసంగిలో వరి సాగు 38,19,413 ఎకరాలు నమోదు.
  10. యాసంగిలో వరిసాగు 123.5 శాతం పెరిగింది.

రైతు బంధు

  1. రైతుబంధు దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శం.
  2. రైతుబంధు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో రూ.10 వేలు అందిస్తున్నాం.
  3. తెలంగాణ స్ఫూర్తితో వివిధ రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు అమలు చేస్తున్నాయి.
  4. రైతుబంధు దేశ రైతు తలరాత మార్చే పురోగామిక మలుపు.
  5. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐరాస ప్రకటించింది.
  6. ఐరాస ప్రకటన రాష్ట్రానికి, రైతులకు గర్వకారణం

రైతు బీమా

  1. రైతు బీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు పది రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నాం.
  2. వ్యవసాయశాఖ బలోపేతం కోసం ప్రతి 5 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం.
  3. ఇకపై రైతు సమన్వయ సమితులు...రైతుబంధు సమితులుగా వ్యవహరిస్తాయి.
  4. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రై.బ.స.లే కీలకంగా వ్యవహరిస్తాయి

మిషన్​ భగీరథ

  1. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని అన్ని అవాస ప్రాంతాలకు ప్రతిరోజూ సురక్షిత మంచినీరు.
  2. మిషన్ భగీరథను 11 రాష్ట్రాలు అధ్యయనం చేశాయి.
  3. దేశవ్యాప్తంగా మిషన్ భగీరథను అమలు చేయడం మంచిదని నీతిఆయోగ్ సిఫారసు చేయడం మనకు తగ్గిన ప్రసంశ.

ప్రజారోగ్యం

  1. ప్రజా వైద్యం కోసం మందులు కొనుగోలు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు మూడింతలు పెంచాం.
  2. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే 40 ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు.
  3. 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూంలు ఏర్పాటు చేశాం.
  4. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు 200 అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం.
  5. మరణించిన వారిని ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు 50 పరమపద వాహనాలు ఏర్పాటు చేశాం.
  6. 84 పీహెచ్‌సీలు ఎస్.క్యూ.ఎ.ఎస్ స్థాయిని దక్కించుకున్నాయి.
  7. న్యూ బార్న్ కేర్ సెంటర్లను 42కి పెంచేందుకు నిర్ణయం.
  8. 4 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి మెడికల్ కళాశాలల సంఖ్యను 9కి పెంచాం.
  9. కేసీఆర్ కిట్ పథకం వల్ల మాతాశిశు సంరక్షణ పెరిగింది.
  10. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్ల సంఖ్య 20 శాతం పెరిగింది.
  11. కంటి వెలుగుతో ప్రపంచంలోనే అతిభారీస్థాయిలో ఐ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ అరుదైన రికార్డు సాధించింది.
  12. కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41 మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించాం.
  13. చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణకు నిర్ణయం.
  14. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు త్వరలోనే కార్యాచరణ ప్రకటన.
  15. బస్తీ దవాఖానాల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం.
  16. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు.
  17. ప్రభుత్వ విభాగాల పునర్వవస్థీకరణను అత్యంత శాస్త్రీయంగా చేపట్టాం.

పల్లెల, పట్టణ అభివృద్ధి:

  1. కొత్త గ్రామీణ, పట్టణ విధానాల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం పెంపు.
  2. పల్లెల అభివృద్ధి కోసం కలెక్టర్లకు ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఇచ్చాం.
  3. ప్రభుత్వ, మంత్రులకు ఉండే అధికారాలు తొలగించి కలెక్టర్లకు ధారాదత్తం చేశాం..
  4. ప్రతినెల గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు.
  5. కొత్త భూపరిపాలన విధానానికి త్వరలోనే శ్రీకారం.

పారిశ్రామిక రంగం

  1. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో 12,427 పరిశ్రమలకు అనుమతులు.
  2. 2 లక్షల 4 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
  3. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఐటీ రంగం

  1. 2013-14లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57వేల కోట్లు.
  2. 2018-19 నాటికి ఐటీ ఎగుమతుల విలువ లక్షా 9 వేల కోట్లకు పెరిగింది.
  3. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తున్నాం.
  4. శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
  5. తెలంగాణలో 6 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
  6. దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం తెలంగాణలోనే ఉన్నాయి.
  7. త్వరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.

ఆర్థిక పరిస్థితి

  1. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది.
  2. పటిష్టమైన పరిపాలనా విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుంది.
  3. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉంది.
  4. తెలంగాణ ఆ దుస్థితిలో లేకపోవడం గుడ్డిలో మెల్ల అన్నట్లు కనిపించే అంశం.
  5. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్ధికాంశాల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని నిర్ణయం.

గవర్నర్​ తమిళిసై ప్రసంగం ముఖ్యాంశాలు...

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

పింఛన్లు

  1. కేవలం తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు.
  2. ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే.
  3. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు.
  4. తెలంగాణ ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుంది.
  5. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  6. ఫలితంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా ఫించన్లు అందనున్నాయి.

విద్యార్థులు, యువత

  1. విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోంది.
  2. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది.
  3. యువత ఉపాధి కోసం నడుపుకునే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.

సంక్షేమ రంగం

  1. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.
  2. హోంగార్డులకు దేశంలో ఎక్కడాలేనంత వేతనం తెలంగాణలోనే అందుతుంది.
  3. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్స్ అందిస్తోంది.
  4. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోంది.
  5. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబరు వన్‌గా నిలబడింది.

విద్యుత్​ రంగం

  1. విద్యుత్ రంగంలో తెలంగాణ అనితర సాధ్యమైన విజయాలు సాధించింది.
  2. ఉమ్మడి ఏపీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు.
  3. తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు వచ్చింది.
  4. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నాం.
  5. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
  6. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
  7. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది

వ్యవసాయం

  1. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం.
  2. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌తో చర్యలు.
  3. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.
  4. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు

నీటిపారుదల రంగం

  1. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సమగ్ర జలవిధానం అమలు.
  2. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం.
  3. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది.
  4. ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది.
  5. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి.
  6. 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం మంజూరు చేసింది.
  7. త్వరలోనే సీతమ్మ బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయి.
  8. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు.
  9. ఈ యాసంగిలో వరి సాగు 38,19,413 ఎకరాలు నమోదు.
  10. యాసంగిలో వరిసాగు 123.5 శాతం పెరిగింది.

రైతు బంధు

  1. రైతుబంధు దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శం.
  2. రైతుబంధు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో రూ.10 వేలు అందిస్తున్నాం.
  3. తెలంగాణ స్ఫూర్తితో వివిధ రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు అమలు చేస్తున్నాయి.
  4. రైతుబంధు దేశ రైతు తలరాత మార్చే పురోగామిక మలుపు.
  5. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐరాస ప్రకటించింది.
  6. ఐరాస ప్రకటన రాష్ట్రానికి, రైతులకు గర్వకారణం

రైతు బీమా

  1. రైతు బీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు పది రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నాం.
  2. వ్యవసాయశాఖ బలోపేతం కోసం ప్రతి 5 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం.
  3. ఇకపై రైతు సమన్వయ సమితులు...రైతుబంధు సమితులుగా వ్యవహరిస్తాయి.
  4. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రై.బ.స.లే కీలకంగా వ్యవహరిస్తాయి

మిషన్​ భగీరథ

  1. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని అన్ని అవాస ప్రాంతాలకు ప్రతిరోజూ సురక్షిత మంచినీరు.
  2. మిషన్ భగీరథను 11 రాష్ట్రాలు అధ్యయనం చేశాయి.
  3. దేశవ్యాప్తంగా మిషన్ భగీరథను అమలు చేయడం మంచిదని నీతిఆయోగ్ సిఫారసు చేయడం మనకు తగ్గిన ప్రసంశ.

ప్రజారోగ్యం

  1. ప్రజా వైద్యం కోసం మందులు కొనుగోలు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు మూడింతలు పెంచాం.
  2. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే 40 ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు.
  3. 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూంలు ఏర్పాటు చేశాం.
  4. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు 200 అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం.
  5. మరణించిన వారిని ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు 50 పరమపద వాహనాలు ఏర్పాటు చేశాం.
  6. 84 పీహెచ్‌సీలు ఎస్.క్యూ.ఎ.ఎస్ స్థాయిని దక్కించుకున్నాయి.
  7. న్యూ బార్న్ కేర్ సెంటర్లను 42కి పెంచేందుకు నిర్ణయం.
  8. 4 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి మెడికల్ కళాశాలల సంఖ్యను 9కి పెంచాం.
  9. కేసీఆర్ కిట్ పథకం వల్ల మాతాశిశు సంరక్షణ పెరిగింది.
  10. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్ల సంఖ్య 20 శాతం పెరిగింది.
  11. కంటి వెలుగుతో ప్రపంచంలోనే అతిభారీస్థాయిలో ఐ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ అరుదైన రికార్డు సాధించింది.
  12. కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41 మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించాం.
  13. చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణకు నిర్ణయం.
  14. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు త్వరలోనే కార్యాచరణ ప్రకటన.
  15. బస్తీ దవాఖానాల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం.
  16. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు.
  17. ప్రభుత్వ విభాగాల పునర్వవస్థీకరణను అత్యంత శాస్త్రీయంగా చేపట్టాం.

పల్లెల, పట్టణ అభివృద్ధి:

  1. కొత్త గ్రామీణ, పట్టణ విధానాల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం పెంపు.
  2. పల్లెల అభివృద్ధి కోసం కలెక్టర్లకు ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఇచ్చాం.
  3. ప్రభుత్వ, మంత్రులకు ఉండే అధికారాలు తొలగించి కలెక్టర్లకు ధారాదత్తం చేశాం..
  4. ప్రతినెల గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు.
  5. కొత్త భూపరిపాలన విధానానికి త్వరలోనే శ్రీకారం.

పారిశ్రామిక రంగం

  1. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో 12,427 పరిశ్రమలకు అనుమతులు.
  2. 2 లక్షల 4 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
  3. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఐటీ రంగం

  1. 2013-14లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57వేల కోట్లు.
  2. 2018-19 నాటికి ఐటీ ఎగుమతుల విలువ లక్షా 9 వేల కోట్లకు పెరిగింది.
  3. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తున్నాం.
  4. శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
  5. తెలంగాణలో 6 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
  6. దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం తెలంగాణలోనే ఉన్నాయి.
  7. త్వరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.

ఆర్థిక పరిస్థితి

  1. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది.
  2. పటిష్టమైన పరిపాలనా విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుంది.
  3. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉంది.
  4. తెలంగాణ ఆ దుస్థితిలో లేకపోవడం గుడ్డిలో మెల్ల అన్నట్లు కనిపించే అంశం.
  5. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్ధికాంశాల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని నిర్ణయం.
Last Updated : Mar 7, 2020, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.