ETV Bharat / state

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్​ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పాల్గొన్నారు. స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.

author img

By

Published : Nov 5, 2019, 4:39 PM IST

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని... అందుకు పురుషులు స్త్రీలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్​ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధిస్తారని... తాను కూడా విద్యార్థినిగా ఉన్నపుడు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు.

ప్రతి మనిషికి విద్య నూతన జ్ఞానాన్ని, సాధికారతను ఇస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు తమిళిసై పట్టాలను అందజేశారు. ఎన్​సీసీ విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అరవింద్ కుమార్​, తదితరులు పాల్గొన్నారు.

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

ఇవీ చూడండి: అధికారుల భద్రతపై దృష్టి సారించండి: సోమేశ్‌కుమార్‌

స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని... అందుకు పురుషులు స్త్రీలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్​ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధిస్తారని... తాను కూడా విద్యార్థినిగా ఉన్నపుడు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు.

ప్రతి మనిషికి విద్య నూతన జ్ఞానాన్ని, సాధికారతను ఇస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు తమిళిసై పట్టాలను అందజేశారు. ఎన్​సీసీ విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అరవింద్ కుమార్​, తదితరులు పాల్గొన్నారు.

స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

ఇవీ చూడండి: అధికారుల భద్రతపై దృష్టి సారించండి: సోమేశ్‌కుమార్‌

TG_Hyd_31_05_Governor On Koti Women's College Convocation_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) స్త్రీలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని... అందుకు పురుషులు స్త్రీ ల పక్కనే ఉండి ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ కోఠి మహిళ కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకలలో గవర్నర్ తో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అరవింద్ కుమార్ ఐ ఏ ఎస్ లు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. విద్యార్థులు ఆనందంగా ఉంటూ... ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తమ లక్ష్యాలను సాధించిన వారు ఇలాంటి వేడుకలకు ముఖ్యఅతిథిలుగా రావాలని తమిళ సై ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రతిరోజు యోగ చేస్తూ... ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధిస్తారని... తాను కూడా విద్యార్థినిగా ఉన్నపుడు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ప్రతి మనిషికి విద్య నూతన జ్ఞానాన్ని, సాధికారతను ఇస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు ఆమె పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా... ఎన్.సి.సి విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు బైట్: తమిళ సై సౌందర్ రాజన్, రాష్ట్ర గవర్నర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.