ETV Bharat / state

Governor On Mahila Darbar: 'మహిళల సమస్యలు వినేందుకు ప్రత్యేక దర్బార్'

author img

By

Published : Jun 8, 2022, 5:25 PM IST

Governor On Mahila Darbar: ప్రజా దర్బార్​లో భాగంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ఈనెల పదో తేదీన వారి సమస్యలు వినేందుకు మహిళా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Governor On Mahila Darbar
గవర్నర్ తమిళిసై

Governor On Mahila Darbar: మహిళల కోసం ప్రత్యేక దర్బార్​ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్​భవన్​లో మహిళా దర్బార్​ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాదర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను గవర్నర్​ తమిళిసై విననున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళల సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 040-23310521 నెంబర్​కి ఫోన్ చేయాలని సూచించారు. అలాగే రాజ్​భవన్ అధికారిక మెయిల్ ఐడీ rajbhavan-hyd@gov.in కు మెయిల్ చేసి అపాయింట్​మెంట్ తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి: జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సోషల్ మీడియా ప్రతినిధులతో కమలనాథుల భేటీ

Governor On Mahila Darbar: మహిళల కోసం ప్రత్యేక దర్బార్​ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్​భవన్​లో మహిళా దర్బార్​ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాదర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను గవర్నర్​ తమిళిసై విననున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళల సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 040-23310521 నెంబర్​కి ఫోన్ చేయాలని సూచించారు. అలాగే రాజ్​భవన్ అధికారిక మెయిల్ ఐడీ rajbhavan-hyd@gov.in కు మెయిల్ చేసి అపాయింట్​మెంట్ తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి: జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సోషల్ మీడియా ప్రతినిధులతో కమలనాథుల భేటీ

బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి.. సురక్షితంగా బయటకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.