ETV Bharat / state

'నలంద కిషోర్​ను క్షోభ పెట్టి ప్రభుత్వమే చంపేసింది' - చంద్రబాబు తాజా వార్తలు

ఏపీ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం కిషోర్​ను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరక, మానసిక హింస పెట్టారని మండిపడ్డారు. వైకాపా వేధింపులకు మనస్థాపంతో మృతి చెందడం బాధాకరమన్నారు.

'నలంద కిషోర్​ను క్షోభ పెట్టి ప్రభుత్వమే చంపేసింది'
'నలంద కిషోర్​ను క్షోభ పెట్టి ప్రభుత్వమే చంపేసింది'
author img

By

Published : Jul 25, 2020, 5:30 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మరణానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నలంద కిషోర్ మృతిపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైకాపా వేధింపులతో మనస్థాపానికి గురై కిషోర్ మృతి చెందాడని విమర్శించారు.

ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని నలంద కిషోర్​పై కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు నలంద కిషోర్‌. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. -చంద్రబాబు, తెదేపా అధినేత

నలంద కిషోర్ మృతిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన మృతి చాలా బాధాక‌రమని సంతాపం ప్రకటించారు. పార్టీ ఓ క్రమ‌శిక్షణ క‌లిగిన నాయ‌కుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబస‌భ్యుల‌కు‌ సానుభూతి తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మరణానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నలంద కిషోర్ మృతిపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైకాపా వేధింపులతో మనస్థాపానికి గురై కిషోర్ మృతి చెందాడని విమర్శించారు.

ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని నలంద కిషోర్​పై కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు నలంద కిషోర్‌. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. -చంద్రబాబు, తెదేపా అధినేత

నలంద కిషోర్ మృతిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన మృతి చాలా బాధాక‌రమని సంతాపం ప్రకటించారు. పార్టీ ఓ క్రమ‌శిక్షణ క‌లిగిన నాయ‌కుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబస‌భ్యుల‌కు‌ సానుభూతి తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.