కౌలు రైతుల కష్ట నష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే వ్యవసాయం చేస్తున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఈరోజు ఏరువాక సాగించినట్లు వెల్లండించారు. ఏరువాక సాగిన అనంతరం స్థానిక రైతులను లక్ష్మీనారాయణ సత్కరించారు.
రైతు నిత్య శ్రామికుడు. కరోనా లాంటి కష్ట సమయంలోనూ విరామం లేకుండా పని చేసే వ్యక్తే రైతు. అన్నదాతలు పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. వారు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. యువత భాగస్వామ్యంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేయాలేనే ఆలోచనతో ఉన్నాను.
- లక్ష్మీ నారాయణ, సీబీఐ మాజీ జేడీ
ఇదీ చదవండి: kaleshwaram:కాళేశ్వరం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల