సికింద్రాబాద్ పరిధిలో గల బోయిన్పల్లి తారా ఫౌండేషన్లోని అనాథ పిల్లలకు ప్రమోద్ మోదీ అనే వ్యక్తి అన్నదానం చేశారు. తన కొడుకు సౌరవ్ మోదీ జ్ఞాపకార్థం అతని జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
తన కుమారుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తారా ఫౌండేషన్ వద్ద ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనాథ పిల్లలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని ప్రమోద్ మోదీ అన్నారు. వారు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, విద్యా సామగ్రిని వారికి అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి