ETV Bharat / state

రీజినల్ రింగ్ రోడ్​కు వేగంగా అడుగులు

author img

By

Published : Apr 20, 2021, 6:21 PM IST

రాష్ట్రానికి మరో మణిహారంగా నిర్మితం కాబోతున్న రీజినల్ రింగ్ రోడ్​కు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించి డీపీఆర్ కన్సల్టెన్సీల నియామానికి ఎన్​హెచ్ఏఐ నోటిఫికేషన్ జారీ చేసింది. డీపీఆర్ ప్రాజెక్టులో భాగం పంచుకోవాలనుకునే ఆసక్తి గల కన్సల్టెన్సీ సంస్థలు జులై 24 వరకు బిడ్డింగ్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే రీజినల్ రింగ్ రోడ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుంది.

Regional Ring Road
రీజినల్ రింగ్ రోడ్డు

రీజినల్ రింగ్ రోడ్​ను రెండు భాగాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఒకటి ఉత్తర భాగం, రెండోది దక్షిణ భాగం. మొదటి భాగం అర్ధచంద్రాకారం, రెండో భాగం మరో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ రెండు కలిపితే రింగ్ మాదిరిగా కన్పిస్తుంది. ఈ రెండు నిర్మాణాలు కలిపితే చూసేందుకు సర్కిల్​గా కన్పిస్తుంది. అందుకే దీన్ని రీజనల్ రింగ్ రోడ్​గా పిలుస్తున్నారు.

మొదటి భాగంలో 158.40 కిలోమీటర్లు, మిగిలిన భాగంలో 181.60 కిలోమీటర్లలో నిర్మాణం చేయనున్నారు. మొత్తం కలిపి 340 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరం వైపు సంగారెడ్డి- నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, జగ్​దేవ్​పూర్, భువనగిరి, చౌటుప్పల్ నుంచి వచ్చే రహదారికి కలిపే విధంగా సుమారు 160 కిలోమీటర్ల జాతీయ రహదారి-ఎన్​హెచ్ 161ఏఏ, దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమన్​గల్, షాద్​నగర్ మీదుగా సంగారెడ్డికి వరకు సుమారు 180 కిలోమీటర్​ల రహదారి దీన్ని ఇంకా జాతీయ రహదారిగా ప్రకటించలేదు.

చిన్న మార్పులు...

సంగారెడ్డి నుంచి మొదలైన రీజినల్ రింగ్ రోడ్ చివరకు తిరిగి సంగారెడ్డి వద్దే ముగిసే విధంగా గతంలోనే ప్రాథమికంగా అలైన్​మెంట్ చేశారు. గతంలో చేసిన అలైన్​మెంట్​లో చిన్నచిన్న మార్పులు తప్ప భారీ మార్పులు పెద్దగా ఉండబోవని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సూచనా ప్రాయంగా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా జాతీయ రహదారుల సంస్థ మరో నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రానికి మంజూరు...

డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు కన్సల్టెన్సీల నియామకాన్ని చేపట్టాలని ఎన్​హెచ్ఏఐ నిర్ణయించింది. భారత్ పరియోజన ఫేజ్-1 భాగంలో రీజినల్ రింగ్ రోడ్​ను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఉత్తర భాగానికి సంబంధించి గతంలోనే ఒక కన్సల్టెన్సీని నియమించింది. బెంగళూరుకు చెందిన టెక్నో ఫీజుబులిటీ కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్​కు సంబంధించిన బీఓటీకి సంబంధించిన వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షించింది.

ప్రాజెక్టు రిపోర్టు...

ఇప్పుడు కొత్తగా నియామకమయ్యే కన్సల్టెన్సీ సంస్థ పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తుంది. భూసేకరణ ఏవిధంగా చేయాలి, భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి డబ్బుల చెల్లింపులు, రీజినల్ రింగ్ రోడ్ అలైన్​మెంట్​కు సంబంధించిన వ్యవహరాలు ఈ కన్సల్టెన్సీలే చూసుకుంటాయి. జులై 24 లోపు కన్సల్టెంట్​లు బిడ్​లు దాఖలు చేసుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. సుమారు ఏడెనిమిది సంస్థలు ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రీజినల్ రింగ్ రోడ్​ పనుల్లో వేగం పుంజుకుంటుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

రీజినల్ రింగ్ రోడ్​ను రెండు భాగాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఒకటి ఉత్తర భాగం, రెండోది దక్షిణ భాగం. మొదటి భాగం అర్ధచంద్రాకారం, రెండో భాగం మరో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ రెండు కలిపితే రింగ్ మాదిరిగా కన్పిస్తుంది. ఈ రెండు నిర్మాణాలు కలిపితే చూసేందుకు సర్కిల్​గా కన్పిస్తుంది. అందుకే దీన్ని రీజనల్ రింగ్ రోడ్​గా పిలుస్తున్నారు.

మొదటి భాగంలో 158.40 కిలోమీటర్లు, మిగిలిన భాగంలో 181.60 కిలోమీటర్లలో నిర్మాణం చేయనున్నారు. మొత్తం కలిపి 340 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరం వైపు సంగారెడ్డి- నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, జగ్​దేవ్​పూర్, భువనగిరి, చౌటుప్పల్ నుంచి వచ్చే రహదారికి కలిపే విధంగా సుమారు 160 కిలోమీటర్ల జాతీయ రహదారి-ఎన్​హెచ్ 161ఏఏ, దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమన్​గల్, షాద్​నగర్ మీదుగా సంగారెడ్డికి వరకు సుమారు 180 కిలోమీటర్​ల రహదారి దీన్ని ఇంకా జాతీయ రహదారిగా ప్రకటించలేదు.

చిన్న మార్పులు...

సంగారెడ్డి నుంచి మొదలైన రీజినల్ రింగ్ రోడ్ చివరకు తిరిగి సంగారెడ్డి వద్దే ముగిసే విధంగా గతంలోనే ప్రాథమికంగా అలైన్​మెంట్ చేశారు. గతంలో చేసిన అలైన్​మెంట్​లో చిన్నచిన్న మార్పులు తప్ప భారీ మార్పులు పెద్దగా ఉండబోవని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సూచనా ప్రాయంగా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా జాతీయ రహదారుల సంస్థ మరో నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రానికి మంజూరు...

డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు కన్సల్టెన్సీల నియామకాన్ని చేపట్టాలని ఎన్​హెచ్ఏఐ నిర్ణయించింది. భారత్ పరియోజన ఫేజ్-1 భాగంలో రీజినల్ రింగ్ రోడ్​ను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఉత్తర భాగానికి సంబంధించి గతంలోనే ఒక కన్సల్టెన్సీని నియమించింది. బెంగళూరుకు చెందిన టెక్నో ఫీజుబులిటీ కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్​కు సంబంధించిన బీఓటీకి సంబంధించిన వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షించింది.

ప్రాజెక్టు రిపోర్టు...

ఇప్పుడు కొత్తగా నియామకమయ్యే కన్సల్టెన్సీ సంస్థ పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తుంది. భూసేకరణ ఏవిధంగా చేయాలి, భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి డబ్బుల చెల్లింపులు, రీజినల్ రింగ్ రోడ్ అలైన్​మెంట్​కు సంబంధించిన వ్యవహరాలు ఈ కన్సల్టెన్సీలే చూసుకుంటాయి. జులై 24 లోపు కన్సల్టెంట్​లు బిడ్​లు దాఖలు చేసుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. సుమారు ఏడెనిమిది సంస్థలు ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రీజినల్ రింగ్ రోడ్​ పనుల్లో వేగం పుంజుకుంటుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.