ETV Bharat / state

ఆర్డరివ్వండి... పోస్టులో ప్రసాదం మీ ఇంటికొస్తుంది.. - prasadam home delivery in telangana news

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలు ఇకపై భక్తుల ఇళ్ల వద్దకే రానున్నాయి. మనకు నచ్చిన గుడిలో ప్రసాదాల కోసం దగ్గరలోని ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి రుసుం చెల్లిస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లో హోం డెలివరీ చేస్తారు. ఈ మేరకు దేవాదాయశాఖ, తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

famous temples Prasadam at the homes
తపాలాశాఖతో దేవాదాయశాఖ ఒప్పందం
author img

By

Published : Mar 27, 2021, 5:45 PM IST

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను తపాలా శాఖ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలు పంపిణీ చేసేందుకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

దేవుళ్ల ప్రసాదాలు హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు.. నేరుగా ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు రుసుం చెల్లించాలని మంత్రి సూచించారు. రెండు, మూడు రోజుల్లో ప్రసాదాలను ఇంటి వద్దకు తెచ్చిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ల‌క్షా 60 వేల తపాలా కార్యాలయాల ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు.

ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్​లనూ త‌పాలా శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్​లైన్​లో పూజ‌ల సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారి కోసం పోస్టాఫీసులో ఆఫ్​లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నట్లు చెప్పారు.

సేవలు అందుబాటులోకి రానున్న ఆలయాలు..

  • యాదాద్రి ల‌క్ష్మీ న‌రసింహస్వామి దేవస్థానం
  • భ‌ద్ర‌ాచ‌లం సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం
  • వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం
  • బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవస్థానం
  • కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆలయం
  • కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం
  • ఉజ్జ‌యిని మ‌హంకాళీ ఆల‌యం
  • సికింద్రాబాద్ గ‌ణేశ్​ దేవాలయం
  • బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌ ఆలయం
  • కర్మన్​ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యం

ఇదీ చూడండి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను తపాలా శాఖ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలు పంపిణీ చేసేందుకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

దేవుళ్ల ప్రసాదాలు హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు.. నేరుగా ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు రుసుం చెల్లించాలని మంత్రి సూచించారు. రెండు, మూడు రోజుల్లో ప్రసాదాలను ఇంటి వద్దకు తెచ్చిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ల‌క్షా 60 వేల తపాలా కార్యాలయాల ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు.

ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్​లనూ త‌పాలా శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్​లైన్​లో పూజ‌ల సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారి కోసం పోస్టాఫీసులో ఆఫ్​లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నట్లు చెప్పారు.

సేవలు అందుబాటులోకి రానున్న ఆలయాలు..

  • యాదాద్రి ల‌క్ష్మీ న‌రసింహస్వామి దేవస్థానం
  • భ‌ద్ర‌ాచ‌లం సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం
  • వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం
  • బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవస్థానం
  • కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆలయం
  • కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం
  • ఉజ్జ‌యిని మ‌హంకాళీ ఆల‌యం
  • సికింద్రాబాద్ గ‌ణేశ్​ దేవాలయం
  • బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌ ఆలయం
  • కర్మన్​ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యం

ఇదీ చూడండి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.