ETV Bharat / state

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం

కుంభవృష్టితో భాగ్యనగరంలోని పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఉమామహేశ్వర కాలనీవాసులను ఈటీవీ భారత్​ బృందం బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడిన ఈటీవీ భారత్​ బృందానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Oct 16, 2020, 7:07 PM IST

'ETV Bharat' team rescues Umamaheswara colony people in hyderabad
ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం

హైదరాబాద్ జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు నిండడం వల్ల పక్కనే ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొదటి అంతస్తు వరకు నీటిలో మునగడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామాన్లను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు వరద ప్రభావంతో తిరిగి వెళ్లలేక ఇండ్లపై చిక్కుకున్నారు. గమనించిన ఈటీవీ భారత్​ బృందం మత్స్యకారుల సహాయంతో బోటులో వారిని ఒడ్డుకు చేర్చారు. దీంతో వారు ఈటీవీ భారత్​ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం
ఇవీ చూడండి: వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్​

హైదరాబాద్ జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు నిండడం వల్ల పక్కనే ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొదటి అంతస్తు వరకు నీటిలో మునగడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామాన్లను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు వరద ప్రభావంతో తిరిగి వెళ్లలేక ఇండ్లపై చిక్కుకున్నారు. గమనించిన ఈటీవీ భారత్​ బృందం మత్స్యకారుల సహాయంతో బోటులో వారిని ఒడ్డుకు చేర్చారు. దీంతో వారు ఈటీవీ భారత్​ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం
ఇవీ చూడండి: వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.