ఈసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ మన్జూర్ హుస్సేన్ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాల కోసం జులై 4న ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండు సెషన్లలో ఆన్లైన్లో అర్హత పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 27,993 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు మన్జూర్ హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. తొలి రోజే 22,864 మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈనెల 30 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ పేర్కొన్నారు.
ఆన్లైన్ అర్హత పరీక్షపై అభ్యర్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న మాక్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సీబీఎస్ఈ ఫైనల్ మార్కులు లెక్కిస్తారిలా...