ETV Bharat / state

అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళి అర్పించిన తూర్పునౌకాదళాధిపతి

author img

By

Published : Mar 2, 2021, 9:02 AM IST

ఏపీలోని విశాఖపట్టణం ఆర్కే బీచ్​ వద్ద ఉన్న విక్టరీ ఎట్ సీ వద్ద అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళి అర్పించారు. తూర్పునౌకాదళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళి అర్పించిన తూర్పునౌకాదళాధిపతి
అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళి అర్పించిన తూర్పునౌకాదళాధిపతి

తూర్పునౌకాదళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ విశాఖలోని ఆర్కే బీచ్​ వద్దనున్నవిక్టరీ ఎట్ సీ వద్ద అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళులు అర్పించారు. 1971 లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా .. అమరులైన జవాన్లు, నావికా సిబ్బంది ఇతర రక్షణ రంగ సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ స్మారకం విశాఖలో నిర్మించారు.

జాతీయ పండుగల రోజున, తూర్పు నౌకాదళాధిపతి ఈ తరహాలోనే వచ్చి నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకోవడం ఆనవాయితీ. కొత్తగా బాధ్యతలను చేపట్టిన తూర్పు నౌకాదళాధిపతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించారు.

తూర్పునౌకాదళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ విశాఖలోని ఆర్కే బీచ్​ వద్దనున్నవిక్టరీ ఎట్ సీ వద్ద అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళులు అర్పించారు. 1971 లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా .. అమరులైన జవాన్లు, నావికా సిబ్బంది ఇతర రక్షణ రంగ సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ స్మారకం విశాఖలో నిర్మించారు.

జాతీయ పండుగల రోజున, తూర్పు నౌకాదళాధిపతి ఈ తరహాలోనే వచ్చి నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకోవడం ఆనవాయితీ. కొత్తగా బాధ్యతలను చేపట్టిన తూర్పు నౌకాదళాధిపతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించారు.

ఇదీ చదవండి: కెరీర్​ కోసం విదేశీ భాషలపై తెలుగు యువత పట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.