ETV Bharat / state

నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!

author img

By

Published : Jul 18, 2020, 2:13 PM IST

తెల్లవారకముందే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా కేసులు వందల సంఖ్యలో వస్తున్నా.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీసా దక్కితే చాలని గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు ఇలా క్యూకట్టారు.

drunkers-in-east-godavari-dst-kakinada-not-maintain-social-distance
నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!
నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఓ వైన్ షాపు వద్ద క్యూలైన్లలో నిల్చున్న మందుబాబుల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రేమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా లైన్లలో నిల్చున్నారు.

ఓవైపు రోజూ వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతుంటే.. మందుబాబులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్​ ఇచ్చి ఇంటికి పంపేశారు..!

నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఓ వైన్ షాపు వద్ద క్యూలైన్లలో నిల్చున్న మందుబాబుల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రేమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా లైన్లలో నిల్చున్నారు.

ఓవైపు రోజూ వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతుంటే.. మందుబాబులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్​ ఇచ్చి ఇంటికి పంపేశారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.